కూచ్బిహార్: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతున్నది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఎంసీ అధ్యక్షురాలు మమతాబెనర్జి కేంద్ర ప్రభుత్వంపైన విమర్శలు గుప్పిస్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కూచ్బిహార్లో ఓ ప్రచార సభలో మాట్లాడిన అమిత్ షా.. బెంగాల్లో మమతా బెనర్జి నడుపుతున్నది 3టీ మోడల్ ప్రభుత్వమన్నారు. మూడు టీలు అంటే తానాషాహి (నియంతృత్వం), టోలాబాజీ (డబ్బులు గుంజడం), తుష్టీకరణ్ (సంతుష్టీకరణ) అని ఆయన చెప్పారు. కానీ, కేంద్రంలో తమ ప్రభుత్వం మాత్రం 3వీ మోడల్ను అనుసరిస్తున్నదన్నారు. ఈ మూడు వీ ల అర్థం వికాస్ (అభివృద్ధి), విశ్వాస్ (నమ్మకం), వ్యాపార్ (వ్యాపారం) అని షా చెప్పారు.
అదేవిధంగా నందిగ్రామ్లో మమతాబెనర్జి ఓటమి ఖరారైపోయిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఓటమి ఖరారవడంతో మమత సలహాదారు ఆమెకు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయమని సూచించారని చెప్పారు. మమత హయాంలో ఉత్తర బెంగాల్లో రాజకీయ హింస విపరీతంగా పెరిగిపోయిందని, ఆ రాజకీయ హింసకు ముగింపు పలకడం కోసం ప్రధానికి ఒక అవకాశం ఇవ్వాలని అమిత్ షా ఓటర్లను కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నేను కరుణానిధి బిడ్డను.. బీజేపీ బెదిరింపులకు భయపడను: స్టాలిన్
బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్న ఆ హైదరాబాదీని తిరస్కరించండి: మమతాబెనర్జి
ఆస్ట్రాజెనికా టీకా అవసరంరాదేమో : అమెరికా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కేజీ రూ. లక్ష
ఊర్వశి వాట్సాప్ బ్లాక్.. ఇశా నేగితో రిషబ్ డేటింగ్ !
బైడెన్ ప్రసంగంలో హోలీ ప్రస్తావన
డొనాల్డ్ ట్రంప్లా మమత తీరు: బీజేపీ
కొవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై
రాబర్ట్ వాద్రాకు కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్లో ప్రియాంక దంపతులు