సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
షాబాద్, మార్చి 31: గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మహేశ్వరం నియోజకవర్గానికి రూ. 10.20 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లో ళ్ళ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ నియోజకవర్గంలోని 111 పనులను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను ఉప యోగించను న్నట్లు తెలిపారు.
కందుకూరు మండలంలోని సరళ రావులపల్లి నుంచి పోతు బండ తండా వరకు రూ. 65లక్షలతో, దెబ్బగూడ నుంచి ముచ్చెర్ల వరకు రూ. 62 లక్షల తో, మహేశ్వరం మండలంలోని ఘట్పల్లి నుంచి ఘట్పల్లి తండా వరకు రూ. 65 లక్షల తో, చిన్న తుప్రా నుంచి నల్ల చెరువు తండా వరకు రూ. 90లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను వెంటనే ప్రా రంభించి, వర్షా కాలంలోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పల్లె నిద్ర కార్యక్ర మం లో భాగంగా మంజూరు చేసిన పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులకు సూ చించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేశ్ చంద్రారెడ్డి, డీఈ శ్రీనివాస్రెడ్డి, ఏఈ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.