పల్లె ప్రగతితో మారిన రూపురేఖలుఎవెన్యూ ప్లాంటేషన్తో హరిత హోయలుసకల హంగులతో వైకుంఠధామంతీరొక్క మొక్కలతో ప్రకృతివనంపెగడపల్లి, మార్చి 28: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని శాలపల్లి అతి చిన్న పంచాయతీ. జనాభా కేవలం 651, రెండేళ్ల క్రితం వరకు అభివృద్ధికి నోచుకోలేదు. పాలకవర్గం సాధారణ నిధులతోనే నెట్టుకొచ్చింది. పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ మినహా మరెలాంటి పనులు చేపట్టలేదు. కాన్నీ, పల్లె ప్రగతి కార్యక్రమం పల్లె రూపురేఖలు మారిపోయాయి. రెండేండ్లకు రూ.17 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామంలో 5 సీసీ రోడ్లు, ఒక బీటీ రోడ్డు నిర్మించారు. రూ.13 లక్షలతో వైకుంఠధామం రూ.3 లక్షలతో పల్లెప్రకృతి వనం, రూ.2 లక్షలతో కంపోస్ట్షెడ్, డంప్ యార్డ్ నిర్మించారు. పంచాయతీ నిధులు రూ.7.70 లక్షలతో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీని కొనుగోలు చేశారు. గతంలో రేషన్ సరుకుల కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని లింగాపూర్కు వెళ్లాల్సి వచ్చేది. మంత్రి ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లగా ఏడాది కిందట ఇక్కడే రేషన్ దుకాణం ఏర్పాటు చేయించారు. రెండుచోట్ల హైమాస్ట్లైట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని మంత్రి సర్పంచ్ బొడ్డు తార పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి.. పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే.. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ చక్రవర్తి మృతి