హైదరాబాద్ : ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకల్లో భాగంగా రంగస్థల కళాకారుడు హరి గోపాల్ను రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాటక రంగంలో మీ ప్రతిభ, నాటకరంగానికి హరి గోపాల్ చేసిన సేవలు నేటి తరానికి, భావితరాలకు మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రపంచ రంగస్థల దినోత్సవం-2021ను తెలంగాణ సంగీత నాటక అకాడమీ నగరంలోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహిస్తుంది. మార్చి 25, 26, 27 తేదిల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఒక నాటక ప్రదర్శనతో పాటు నాటకరంగ ప్రముఖ కళాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడతాయి.
ఇందులో భాగంగా గురువారం చారిత్రక నాటకం భాగమతి(భాగ్యనగర ప్రణయగాధ)ను ప్రదర్శించారు. ఈ నాటకాన్ని మంత్రి ఆధ్యంతం వీక్షించారు. కళామూర్తులైన మీరు కొన్ని దశబ్దాలుగా నాటక కళారంగంలో మమేకమై ఎందరో కళాభిమానులకు ఆనందాన్ని, వికాసాన్ని పంచారని మంత్రి కొనియాడారు.