హైదరాబాద్ : ఓ బాలుడి మృతి కేసులో ఆటో డ్రైవర్తో పాటు యజమానిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో నమోదైన కేసు వివరాలిలా ఉన్నాయి. మార్చి 5న మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ వెంకటేశ్(31) ర్యాష్ డ్రైవింగ్తో ఆటో అదుపుతప్పింది.
దీంతో అందులో ప్రయాణిస్తున్న విశాల్(9) అనే బాలుడు రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయం తగిలింది. చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.
చేవేళ్ల పోలీసులు డ్రైవర్ వెంకటేశ్ అదేవిధంగా ఆటో యజమాని అంజయ్యపై కేసు నమోదు చేశారు. వెంకటేశ్కు డ్రైవింగ్ లైసెన్స్ సైతం లేదు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. జ్యూడిషియల్ రిమాండ్కు తరలించారు.