హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23(నమస్తే తెలంగాణ): ప్రఖ్యాత గాయని, హైదరాబాద్ సిస్టర్స్లో ఒకరైన లలిత (71) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. లలిత, ఆమె సోదరి హరిప్రియ హైదరాబాద్ సిస్టర్స్గా శాస్త్రీయ సం గీత ప్రియులకు సుపరిచితులు. లలిత ఎనిమిదేండ్ల వయసులోనే శాస్త్రీయ గీతాలను ఆలపించడం ప్రారంభించారు. ఆలిండియా రేడియోలో సంగీత విభావరి లో పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, అమెరికా, కెనడా, సింగపూర్, బ్రిటన్, దుబాయ్ తదితర దేశాల్లో సంగీత కచేరీలు నిర్వహించారు.