రాయ్పుర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్ జట్లు తలపడుతున్నాయి. టోర్నీ ఆసాంతం సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని ఇండియా జట్టు అద్భుత ప్రదర్శన చేసి తుదిపోరుకు చేరుకుంది. ఆదివారం జరుగుతున్న టైటిల్ పోరులో టాస్ గెలిచిన లంక లెజెండ్స్ కెప్టెన్ తిలకరత్నె దిల్షాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇండియా ఇన్నింగ్స్ను సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ ప్రారంభించారు.