హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు ఎమ్మెల్సీ, ఆయన తనయ సురభి వాణీదేవి నివాళులర్పించారు. మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె ఆదివారం నగరంలోని నెక్లెస్రోడ్లో ఉన్న మాజీ ప్రధాని పీవీ ఘాట్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పారు. పీవీ దేశానికి సేవలు మరిచిపోలేనివని, ఆయన స్ఫూర్తిగా పని చేస్తానన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ కార్యకర్తల సహకారంతోనే ఎన్నికల్లో గెలుపొందానన్నారు.