అహ్మదాబాద్: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్తో జరిగిన చివరి టీ20లో ఓపెనర్గా వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలుసు కదా. కేవలం 52 బంతుల్లోనే 80 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఇప్పటి వరకూ తన టీ20 కెరీర్లో కేవలం 8 సార్లే కోహ్లి ఇలా ఓపెనర్గా వచ్చాడు. అయితే ఇంగ్లండ్పై రాణించిన విరాట్.. ఇప్పుడు రాబోయే ఐపీఎల్లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఓపెనింగ్ చేయాలని ఆరాటపడుతున్నాడు. ఐపీఎల్లోనూ ఓపెనర్గా వస్తను. గతంలో వివిధ స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. ఇప్పుడు టీమ్కు బలమైన మిడిలార్డర్ ఉంది. రోహిత్తో కలిసి ఓపెనింగ్ రావాలని నాకూ ఉంది. మా ఇద్దరిలో ఒకరు క్రీజులో ఉంటే ఇతర బ్యాట్స్మెన్లో కూడా విశ్వాసం పెరుగుతోంది అని కోహ్లి మ్యాచ్ తర్వాత అన్నాడు. కోహ్లి ఐపీఎల్లో ఇప్పటి వరకూ 18సార్లు ఓపెనర్గా వచ్చాడు. అందులో 37 సగటుతో 595 పరుగుల చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 142గా ఉండటం విశేషం.