బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి
సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం ప్రారంభం
]]]బెల్లంపల్లి టౌన్, మార్చి 20 : బెల్లంపల్లి ఏరియాలో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జీఎం బీ సంజీవరెడ్డి తెలిపారు. దవాఖానలోని ఐసొలేషన్ కేంద్రానికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం, పాత జీఎం కార్యాలయంలో సింగరేణి దవాఖాన ఫార్మసీ అదనపు కౌంటర్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరియా పర్సనల్ మేనేజర్లు లక్ష్మణ్రావు, లోల్ల రామశాస్త్రి, ఏరియా దవాఖాన అదనపు ముఖ్య వైద్యాధికారి రామలశౌరితో కలిసి జీఎం మాట్లాడారు. వారం వ్యవధిలో బెల్లంపల్లి ఏరియా దవాఖాన, గోలేటి డిస్పెన్సరీల్లో కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇటీవల ఒక్క రోజే దేశంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిందని గుర్తుచేశారు. కార్మికులు, వారి కుటుంబాలు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్-19 ప్రాబల్యం తగ్గిందని మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ప్రజలు తేలికగా తీసుకుంటున్నారన్నారు. కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కార్మిక కుటుంబాలు ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఆక్సిజన్ కొరతతో బాధితులు ఇ బ్బందులు పడ్డ దృష్ట్యా ప్రభుత్వం అన్ని ఏరియా ల్లో ఆక్సిజన్ సిస్టమ్స్ను ఏర్పాటు చేస్తున్నదని చె ప్పారు. బెల్లంపల్లిలో రూ.7 లక్షల నిధులతో ఏ ర్పాటు చేసిందని తెలిపారు. ఐసోలేషన్ కేం ద్రంలో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్ ఇవ్వాలని టీబీజీకేఎస్ రీజియన్ కమిటీ సభ్యుడు కలాలి నర్సయ్య జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఆదినారాయణ, మురళి, రాధాకృష్ణ, ఫిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, నాయకులు కుమారస్వామి, స్వరూపారాణి, అనసూర్య, శ్రీధర్, శ్రీనివాస్, స్వామి, సురేశ్ పాల్, తిరుపతి, అరుణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.