గత వారం విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన చిత్రం జాతిరత్నాలు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ప్రధాన పాత్రలు పోషించగా, నవీన్ సరసన కథానాయికగా నటించి అలరించింది ఫరియా అబ్దుల్లా. ఈ అమ్మడికి జాతి రత్నాలు తొలి చిత్రమే అయినప్పటికీ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మేకర్స్ దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం ఫరియా అబ్ధుల్లాకు ఆఫర్స్ క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది. మాస్ మహరాజా ప్రస్తుతం ఖిలాడి అనే సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమా తర్వాత త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇందులో కథానాయికగా ఫరియా అబ్దుల్లాకి అవకాశం ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.