శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ) సంస్థకు నిన్న మొన్నటి వరకూ ఒక్క మహిళ కూడా డైరెక్టర్గా ఎంపిక కాలేదు. తొలిసారిగా,
కోల్కతాకు చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ధృతి బెనర్జీ ఆ ప్రతిష్ఠాత్మక సంస్థకు నాయకత్వం వహించనున్నారు. 105 ఏండ్లుగా జీవ వైవిధ్యం, జంతు పరిరక్షణ, అడవుల పచ్చదనంపై ఈ సంస్థ నిర్విరామంగా కృషి చేస్తున్నది. 51 యేండ్ల ధృతి తన రంగంలో ఎన్నో పరిశోధనలు చేశారు.
సాధారణ సైంటిస్టుగా ఆ ఆవరణలో అడుగు
పెట్టిన ధృతి బెనర్జీ.. ఇప్పుడు డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తొలిరోజుల్లో, జడ్ఎస్ఐలో మహిళా శాస్త్రవేత్తలకు ప్రవేశం ఉండేది కాదు. 1949 తర్వాతే తలుపులు తెరుచుకొన్నాయి. అప్పట్లో, మొదటి మహిళా శాస్త్రవేత్తగా మీరా మున్సుఖానీ చరిత్ర సృష్టించారు. మీరా స్ఫూర్తితో సైంటిస్టుగా చేరిన ధృతి ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ అయ్యారు.