యాదాద్రి:యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పనులు కొనసాగుతున్నాయి. ప్రధానాలయం పూర్తి కావడంతో ఆలయ పునఃప్రారంభ తేదిని ప్రకటించడంతో తుదిమెరుగుల పనుల్లో ఆలయ అధికారు లు వేగం పెంచారు.
కొండపైన బాలాలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు ధర్మ దర్శనాల క్యూలైన్లను అధికారులు శుక్రవారం తొల గిస్తున్నారు. ఆ పక్కనే బస్ బే నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో క్యూ లైన్ల తొలగించాల్సి వస్తుందని అధికారు లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న హోటల్ నుంచి నేరుగా గోపురం వద్దకు దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు.