యాదాద్రి: గ్రామ స్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం నడుం బిగించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో ప్రభుత్వ విప్, డీసీ సీబీ చైర్మన్ను యాదగిరిగుట్ట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మండల, పట్టణ నాయకులతో మర్యా దపూర్వకంగా కలిసి, గజమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి పలు సూచనలు చేశారు. గ్రామ, వార్డు, మండల కమిటీ, పట్ట ణ కమిటీలకు ఎన్నికైన నాయకులు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సరైన రీతిలో సమాధానాలిస్తూ ప్రజలకు నిజా లు తెలియజేయాలని తెలిపారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, సిద్ధాంతాలను పాటించడం వల్లే నేడు రాష్ట్రంలో ప్రభుత్వం అధి కారం ఉందన్నారు. కమిటీలను పారదర్శకంగా కార్యకర్తల సమక్షంలో ఎన్నుకున్నట్లు, సభ్యత్వ నమోదులోనూ ఆలేరు నియోజకవర్గం ముందున్నదని పేర్కొన్నారు.
ఏ ప్రాంతీయ పార్టీకీ కూడా ఢిల్లీలో కార్యాలయం లేదని, కానీ కేసీఆర్ కృషి, పాలన వల్ల నేడు టీఆర్ఎస్ భవన్ను నిర్మిస్తు న్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో 10వేల మందితో గులాబీ సైన్యంను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు.
గ్రామ, వార్డు, పట్ట ణ కమిటీల్లో చోటు దక్కలేదని బాధ పడవద్దని, మరో పదవి అప్పగిస్తామని హామీ నిచ్చారు. పార్టీ కార్యకర్తలకు గులాబీ కండువాలే ఆయధమని, గతంలో మాదిరి గా దళారులు, పైరవీలకు తావులేకుండా నేరుగా అర్హులకు సంక్షేమ పథకాలను అందుతున్న తీరును ప్రజలకు నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు టీఆర్ఎస్ కుటుంబసభ్యులకు గొంగిడి దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాగౌడ్, పీఏసీ ఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మదర్ డైయిరీ డైరక్టర్ కళ్లెపల్లి శ్రీశైలం, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు మిట్ట వెంకటయ్య, మండల కన్వీనర్ జిన్నా మాదవ రెడ్డి, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు ముక్యర్ల సతీశ్ యాదవ్, నాయకులు బీర్ల మహేశ్, అంకం నర్సింహ్మ, కీసరి బాలరాజుగౌడ్, కౌడే మహేందర్, పాపట్ల నరహరి, కాదూరి శ్రీశైలం, బూడిద అయిలయ్య, సయ్యద్ బాబా, మొగిలిపాక రమేశ్, ఆరె మల్లేశ్గౌడ్, బర్ల శివయ్య తదితరులు పాల్గొన్నారు.