చౌటుప్పల్ రూరల్ : ఈ నెల 2న విడుదలైన అఖండ సినిమాలో ఓ రైతు కాడెడ్లు నటించాయి. సినిమాలో పలు సన్నివేశాల్లో కనిపించి కనివిందు చేశాయి. వివరాలోకి వెళ్లితే… మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన రైతు నూనే శ్రీనివాస్ యాదవ్ గో ఆధారిత వ్యవసాయం చేయడానికి అవులతో పాటు రెండు ఒంగోలు జాతి ఎద్దులను గత ఏడాది కొనుగోలు చేశారు. వాటికి కృష్ణార్జునులు అనే నామకరణం చేశారు. సెంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి వాటిని ఉపయోగిస్తున్నాడు.
గో ఆధారితంగా పెంచిన గడ్డిని, ఉడికించిన జొన్నలు, ఉలువలు ఆహారంగా ఇస్తున్నాడు. దీంతో పాటు వాటికి బరువైన బండరాయిని ఈడ్చుకుంటూ వేగంగా పరుగెత్తేలా శిక్షణ సైతం ఇచ్చారు. బల ప్రదర్శనకు కావాల్సిన మేళుకువలు నేర్పించారు. ఈ క్రమంలో రైతు తర్పీదు ఇచ్చిన కొన్ని ప్రదర్శనలను సినిమాలో ఎద్దులు చూపిస్తాయి. దీంతో ఆ నోట, ఈ నోట వాటి ప్రదర్శన పాకడంతో సినిమాకు తీసుకెళ్లుతున్నారు. ఇంతకుముందు అఖండ మూవిలో నటించేందుకు వాటిని తీసుకెళ్లారు.
గో ఆధారిత సెద్యంపై ఆసక్తి కలిగేందుకే… నూనే శ్రీనివాస్ యాదవ్, రైతు
గో ఆధారిత సేద్యంపై ఆసక్తి కలిగించేందుకు బల ప్రదర్శన పోటీలకు ఎద్దులను సిద్ధం చేశా. వాటి ప్రతిభను చూసి సినిమాలో కూడా అడుగుతున్నారు. అందులో భాగంగా అఖండ సినిమాకు తీసుకెళ్లారు. ఏదో వారి వద్ద ఆశించి వాటిని ఇవ్వలేదు. గో ఆధారిత సెద్యంపై రైతులకు మరింత ఆసక్తి కలుగాలని తీసుకెళ్లా. సినిమాలో ఎడ్ల నటపై చూసిన వారు చెప్పడం చాలా సంతృప్తినిచ్చింది.