యాదాద్రి, ఆగస్టు3: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలోని విష్ణుపుష్కరిణి వద్ద ఉన్న క్షేత్రపాలకుడికి అర్చకులు సిందూరంతో మంగళ వారం అభిషేకం నిర్వహించారు. ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. తమలపాకులతో అర్చన చేశారు. స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. యాదాద్రీశుడి బాలాలయంలో నిత్యరాధనలు ఉదయం నిజాభిషేకంతో ప్రారంభమయ్యాయి. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీసుదర్శన నారసింహహోమం జరిపారు. మహా మండపంలో అష్టోత్తర పూజలు చేశారు. సాయం త్రం అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొ న్న భక్తులకు స్వామివారి ఆశీస్సులను అందజేశారు. అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్లో భక్తులు పాల్గొని వ్రతమాచరించారు. సువర్ణ పుష్పార్చనలో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
లక్ష్మీనరసింహస్వామి వారిని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, టెక్నికల్ కమిటీ సభ్యులు డీఎల్ఎం రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్రెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. స్వామివారి ముఖమండపం వద్దకు చేరుకున్న ప్రముఖులు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర సేవలో పాల్గొని ప్రత్యేక పూజలుచేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారి ఖజానాకు రూ. 6,12,448 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.6,12,448 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 64,652, రూ. 100 దర్శనంతో రూ. 35,000, నిత్యకైంకర్యాలతో రూ 1,000, క్యారీబ్యాగులతో రూ.1,100, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ. 9,000, కల్యాణకట్టతో రూ.7,800, ప్రసాద విక్రయంతో రూ. 2,85,820, శాశ్వత పూజల ద్వారా రూ. 7,116, వాహన పూజలతో రూ.7,600, టోల్గేట్తో రూ.760, అన్నదాన విరాళంతో రూ.13,149, సువర్ణ పుష్పార్చనతో రూ. 65,320, యాదరుషి నిలయంతో రూ.27,200, పాతగుట్టతో రూ. 8,615, పుష్కరిణి ద్వారా రూ. 800, టెంకాయల విక్రయంతో రూ. 30,000, ఇతర విభాగాలతో రూ.47,516తో కలుపుకొని రూ. 6,12,448 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
యాదాద్రీశుడికి బంగారు పుస్తెలతాడు అందజేత
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి పలువురు దాతలు తమకు తోచిన సాయం అందిస్తున్నారు. హైదరాబాద్లోని నాగోల్కు చెందిన కె. శివశంకర్, రాజేశ్వరి దంపతులు స్వామి వారికి రూ. 2 లక్షలు విలువ చేసే బంగారు పుస్తెల తాడును మంగళవారం సమర్పించారు.
సీతారాముల ఆలయంలో రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు
మోత్కూరు, ఆగస్టు3: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని సీతారాముల ఆలయంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి- పద్మ దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు చేశా రు. ఆలయ అర్చకుడు సూరిబాబుశర్మ వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్లు వెంకన్న, కల్యాణ్ చక్రవర్తి, మండల పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
లింగబసవేశ్వర స్వామిని దర్శించుకున్న ఆర్డీవో
బీబీనగర్, ఆగస్టు3: మండలంలోని పడమటిసోమారం గ్రామంలోని లింగబసవేశ్వర స్వామిని మంగళవారం ఆర్డీవో భూపాల్రెడ్డి దర్శించుకుని ప్ర త్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వాకిటి బస్వారెడ్డి, ఈవో గాదె నరేందర్రెడ్డి, రాంసింగ్, వీఆ ర్వో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.