యాదాద్రి భువనగిరి, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో హరితహారం కార్యక్రమం పెద్దఎత్తున కొనసాగుతున్నది. ఊరూ-వాడ ఒక్కటై కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు సాగుతున్నారు. కలెక్టర్ పమేలాసత్పతితోపాటు జిల్లాస్థాయి అధికారులు రోజుకోచోట హరితహారంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం సబ్బండ వర్ణాలు సైతం ఇందులో భాగస్వాములవుతున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేయడంతో ఇండ్ల పరిసరాల్లో పూలు, పండ్ల మొక్కలను చాలావరకు నాటుకున్నారు. ఓ వైపు మొక్కలు నాటుతూనే.. మరోవైపు గుంతలు తీసే పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అడవిజాతి మొక్కలతోపాటు ఫలాలు ఇచ్చే మొక్కలను సైతం ఈసారి హరితహారంలో నాటుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాలు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా పల్లెప్రకృతివనాలు, వైకుంఠధామాల పరిసరాల్లో విరివిగా మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పొలం గట్ల వెంట తాటి వనాలను నాటే దిశగా సంబంధితశాఖ అధికారులు వేగవంతంగా చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటివరకు 7,75,541 మొక్కల నాటింపు
ఏడో విడుత హరితహారంలో భారీ స్థాయిలో మొక్కలను నాటాలన్న ఉద్దేశంతో జిల్లా స్థాయి అధికారులు నర్సరీల్లో అధిక సంఖ్యలో మొ క్కలను పెంచేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేయగా, అటవీశాఖ సైతం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసి ఉంచిం ది. మొత్తంగా 70.13 లక్షల మొక్కలను హరితహారంలో నాటేందుకు నర్సరీల్లో సిద్ధంగా ఉంచారు. 12 శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొద్దిరోజులుగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా రు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధ్దిగా కురుస్తుండటంతో అనుకున్న లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేసే దిశగా అన్ని శాఖలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు జిల్లాలో 7,75,541 మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయ్యింది. మొక్క లు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత ను కూడా ఆయా శాఖలకు ప్రభుత్వం అప్పగించింది. ఇవన్నీ ఆకుపచ్చ తెలంగాణకు బాటలు వేస్తున్నాయి.
గ్రీన్ చాలెంజ్ తోడుగా..
ఏడు విడుతల హరితహారం కార్యక్రమానికి ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ చాలెం జ్ కార్యక్రమం తోడ్పాటునందించింది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించిన మొక్కలు నా టారు. ఇదే స్ఫూర్తితో సందర్భమేదైనా సంతోషకర సమయాల్లో మొక్కలు నాటడం పరిపాటైంది. సం దర్శనలు, పుట్టినరోజు, పెళ్లి వేడుకలు, పండుగల ఇతర కార్యక్రమా ల సందర్భాల్లోనూ విరివిగా మొక్కలు నాటుతున్నారు. అంతరించిపోయిన అడవుల విస్తీర్ణం పెంపునకు తెలంగాణ ప్రభుత్వం యజ్ఞం లా చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నది. ఇప్పటివరకు నాటిన మొక్కల లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా 11వ స్థానంలో ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
పీఎస్లో మొక్కలు నాటిన కొల్లేటి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా శుక్రవారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ రాష్ట్రంలో అద్భుతంగా అమలవుతున్నదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పట్టణ సీఐ జానకీరెడ్డి, రూరల్ సీఐ నర్సయ్య తదితరులు ఉన్నారు.