యాదాద్రి, జూలై26: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో నిత్యపూజల కోలాహలం తెల్లవా రు జాము మూడు గంటల నుంచి మొదలైంది. స్వామివారికి నిజాభిషేకంతో అర్చకులు ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా స్వామివారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. సాయంత్రం వేళ అలంకార జో డుసేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజ లు జరిపారు. సత్యనారాయణ స్వామివారి వ్రత పూజ ల్లో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వయంభూవులను నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి.
రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి సోమవారం అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొ ని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. ఉదయాన్నే శివుడిని ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించారు. విభూతితో స్వామిని అలంకరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చన చేశారు. శివాలయ ప్రధాన, ఉప ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు.
స్వామివారి ఖజానాకు రూ.9,32,733 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.9,32,733 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.87,100, రూ.100 దర్శనంతో రూ.6,000, వీఐపీ దర్శనాలతో రూ.63,000, నిత్యకైంకర్యాల ద్వారా రూ. 800, క్యారీబ్యాగులతో రూ.3,100, సత్యనారాయణ స్వామివ్రతాలతో రూ.17,000, కల్యాణకట్టతో రూ. 13,800, ప్రసాద విక్రయంతో రూ.3,48,770, శాశ్వ త పూజల ద్వారా రూ.38,232, వాహనపూజలతో రూ.11,500, టోల్గేట్తో రూ. 1,040, అన్నదాన విరాళంతో రూ.24,011, సువర్ణ పుష్పార్చనతో రూ. 88,740, యాదరుషి నిలయంతో రూ. 25,900, పాతగుట్టతో రూ.6,570, టెంకాయల విక్రయంతో రూ. 39,000, ఇతర విభాగాలతో రూ.1,58,170 కలుపుకొని రూ. 9,32,733 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.