మోటకొండూర్, జూలై 26: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం దేశానికే ఆదర్శమని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని పేర్కొన్నారు. మండలంలోని చాడ గ్రామానికి చెందిన సిరిమల్లె మల్లేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా అతడి కు టుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. సాధారణ మరణం సంభవించిన రైతు కుటుంబానికి దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రైతు బీమా పథకంతో ఆర్థిక భరోసా అందించి అం డగా నిలుస్తున్నారని కొనియాడారు. రైతుల బీమా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నదన్నారు. మల్లేశ్కు రైతు బీమా పథకం కింద రూ. 5లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, గ్రామ సర్పంచ్ మల్గ ఎట్టమ్మ, టీఆర్ఎస్ మం డల సెక్రటరీ జనరల్ నర్సింహులుయాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు ఈరగాని శ్రీనివాస్గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ మహమూద్, గ్రామశాఖ అధ్యక్షుడు పబ్బతి శ్రీధర్రెడ్డి, నాయకులు మల్గ సిద్ధులు పాల్గొన్నారు.
మొదటి విడుతలో రూ.50కోట్ల రుణాలు
ఆలేరు టౌన్, జూలై26: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెట్టుబడు ల కోసం రైతులకు ఈ ఏడాది వానకాలంలో మొదటి విడుతలో రూ.50కోట్లు ఇవ్వనున్నామని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. ఆలేరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు పడేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. సకాలంలో పెట్టుబడుల కోసం రైతుబంధు పథకం కింద ఎకరాకు రెం డు విడుతల్లో రూ.10వేల చొప్పున ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నదన్నారు. ఆలేరు నియోజకవర్గంలో యాసంగిలో లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
ఆలేరు పట్టణానికి చెందిన భాస్కర్రెడ్డి కుమారుడు అర్జున్రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. సోమవారం డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి అతడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకర య్య, నాగరాజు, వెంకటేశ్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.