తుర్కపల్లి, జూలై24: హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముక్కో టి వృక్షార్చనలో భాగంగా శనివారం సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో స్థానికులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. అంతకుముందు మొక్కలు నాటే ప్రాంతంలో గ్రామస్తులతో కలిసి స్వయంగా ముగ్గులు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో అడవుల ను నాశనం చేయడంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడే పరిస్థితి వచ్చిందన్నారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గ్రామాల్లో పచ్చదనం సంతరించుకుంటుందని అన్నారు. అనంతరం గ్రామస్తులు మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్, జడ్పీవైస్ చైర్మన్ భీక్కూనాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్, కొమిరిశెట్టి నర్సింహులు, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, రైతుబంధుసమితి జిల్లా సభ్యురాలు పలుగుల ఉమారాణి, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీటీసీ కరుణాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్ధ్దునాయక్, కో-ఆప్షన్ సభ్యుడు రహమత్షరీఫ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు సుంకరి శట్టయ్య, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్గౌడ్, నాయకులు కరుణాకర్రెడ్డి, తలారి శ్రీనివాస్, రాజయ్య, భాస్కర్నాయక్, శ్రీశైలం, ఎండీ యాకుబ్, శ్రీకాంత్, భాస్కర్యాదవ్, శంకర్నాయక్, మధు తదితరులున్నారు.
మొక్కలను నాటి సంరక్షించాలి
యాదగిరిగుట్ట రూరల్, జూలై 24: ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శనివా రం ఆమె మండలంలోని మహబూబ్పేట గ్రామంలో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ను పురస్కరించుకుని ముక్కోటి వృక్షార్చనలో భాగంగా గ్రా మస్తులతో కలిసి నాలుగు వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ నిబద్ధ్దతతో పని చేసి గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన పుట్టిన రోజున మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, జడ్పీటీసీ తొటకూరి అనురాధ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.