యాదాద్రి, జూన్ 22: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలు వురు భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమై న వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమ ర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ని త్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభ మయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్య కల్యాణం నిర్వహించారు. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మీనరసింహుల నిత్యకల్యా ణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తొలుత శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. మహా మండపం లో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు శ్రీస్వామి అమ్మవారుల ఆశీస్సులు అందజేశారు.
రూ. 5,66,687 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు రూ. 5,66,687 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. ఇందులో ప్రధాన బుకింగ్ ద్వారా రూ.47,912, రూ.100 దర్శనాల ద్వారా రూ. 25, 100, క్యారీ బ్యాగుల ద్వారా రూ. 1,650, సత్య నారా యణ స్వామి వ్రతాల ద్వారా రూ. 17,000, కల్యాణ కట్ట ద్వారా రూ.11,480, ప్రసాద విక్రయాల ద్వారా రూ.3,15,165, శాశ్వత పూజల ద్వారా రూ. 16,116, వాహనపూజల ద్వారా రూ. 4,300, టోల్ గేట్ ద్వారా రూ. 1,100, అన్నదాన విరాళం ద్వారా రూ. 10,8 16, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 39,620, యా దరుషి నిలయం ద్వారా రూ. 31,900, పాతగుట్ట ద్వా రా రూ. 13,920, పుష్కరిణి ద్వారా రూ. 600, కొబ్బ రికాయల విక్రయాల ద్వారా రూ. 25,140, ఇతర విభాగాల ద్వారా రూ. 4,873తో కలిపి రూ. 5,66, 687 ఆదాయం వచ్చినట్లు ఆమె తెలిపారు.
ఎమ్మెల్యే పైళ్లను కలిసిన ‘మత్స్యగిరి’ధర్మకర్తలు
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధి మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనుబం ధ దేవాలయం వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్స వాల భాగంగా నిర్వహించే స్వామి వారి కల్యాణ మహో త్సవ వేడుకకు శాసన సభ్యుడు పైళ్ల శేఖర్రెడ్డిని ఆహ్వా నించడానికి మంగళవారం ఆయన క్యాంపు కార్యాల యంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసా ని కిరణ్రెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రాన్ని అందజేశా రు. కార్యక్రమంలో ఈవో రవికుమార్, ధర్మకర్తలు, అర్చ కులు తదితరులు పాల్గొన్నారు.