యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్య పూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మీనరసింహుల నిత్యకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
తొలుత సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం అలం కార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. పాతగుట్టలో లక్ష్మీనరసింహస్వామి వారి నిత్యపూజలు ఆలయ సంప్రదాయరీతిలో కొనసాగాయి.