పీఏసీఎస్ చైర్మన్ మల్లేశ్గౌడ్
ఆలేరురూరల్, ఏప్రిల్ 10: రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని కొల్లూరు, పటేల్గూడెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24గంటల పాటు ఉచిత విద్యుత్, రైతుబీమా, రైతుబంధు, సబ్సిడీ కింద ఎరువులు, విత్తనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, సర్పంచ్లు కొటగిరి జయమ్మ, పులుగం పద్మ, పీఏసీఎస్ డైరెక్టర్లు గవ్వల నర్సింహులు, బీస్ కృష్ణం రాజు, కూళ్ల సిద్ధులు, భిక్షపతి, టీఆర్ఎస్ మండల కార్యదర్శి జనగాం వెంకటపాపిరెడ్డి పాల్గొన్నారు.