సాయుధపోరాట స్ఫూర్తితోప్రగతి వైపు పరుగులు
మండలానికే ఆదర్శం పల్లె పకృతి వనం
పకడ్బందీగా పారిశుధ్య పనులు
రాజాపేట, ఏప్రిల్ 18: తెలంగాణ పల్లె సీమలను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతో పల్లె రూపురేఖలు మారి ప్రగతి వై పు పరుగులు పెడుతున్నది. నాడు ఆ ఊరి పేరు చేబితేనే రజా కార్లకే గుండెల్లో దడ పుట్టేది. రజకార్లను గడగడలాడించిన పో రాటల పురిటిగడ్డ, సాయుధ పోరాటయోధుడు చింతపూరి రాంరెడ్డి జన్మ స్థలమైన రేణికుంట గ్రామాన్ని సర్పంచ్ బూర్గు భాగ్మమ్మ ఆ పోరాటయోధుల స్ఫూర్తితో ముందుకు సాగుతూ గ్రామ అభివృద్ధిని ఉద్యమంలా పని చేస్తున్నారు. గ్రామంలో పల్లె పకృతివనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామ పనులు చూసిన వారు ఎవరైనా సరే వారెవ్వా అనేలా తలపిస్తున్నాయి.
పక్కగా పల్లె ప్రగతి
గ్రామంలో 553 నివాస గృహాలు ఉండగా 2250 మంది జనాభా, 1506 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ సర్కార్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామంలో పక్కగా అమ లు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామంలో పారిశుధ్య పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. గ్రామ వీధుల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్తను తొలగించి గ్రామాన్ని అం దంగా తీర్చిదిద్దాతున్నారు. ఆదేవిధంగా గ్రామంలో ప్రమాదక రంగా ఉన్న మూడు పురాతన కాలం నాటి బావులను పూడ్చి వేయడమే కాకుండా పాడు బడిన 16 ఇండ్లను తొలగించారు. వీధుల్లో తుప్పుపట్టి పోయిన స్తంభాలను తొలగించి, 20 కొత్త స్తంభాలు ఏర్పాటు చేయించి ఏల్ఈడీ బల్బులు బిగించడంతో రాత్రి వేళల్లో వీధులన్నీ వెలుగులతో జిగేల్ మంటున్నాయి.
ప్రతిష్టాత్మకంగా హరితహారం
హరితహార కార్యక్రమంలో భాగంగా గ్రామం నుంచి రాజా పేట రోడ్డుకు ఇరువైపులా మొక్కలు, గ్రామ వీధుల్లో, పాఠశాల ఆవరణలో 4వేల పైగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చద నంతో కళకళాడుతున్నాయి. గ్రామాన్ని కలెక్టర్ అనితారామ చంద్రన్ ఇటీవల సందర్శించి పల్లె ప్రగతి పనులు బేష్గా ఉ న్నాయని సర్పంచ్ భాగ్మమ్మను అభినందించారు. గత ఏడాది గణతంత్ర వేడుకల్లో మండల ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డును సైతం కైవసం చేసుకుంది ఈ గ్రామపంచాయతీ.
గ్రామాభివృద్ధి కోసం విరాళాలు
తాము పుట్టి పెరిగిన ఊరి బాగు కోసం పలువురు విరాళాలు అందించడానికి ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన బూ ర్గు సతీశ్రెడ్డి రూ. 3 లక్షలు, కొన్యాల యాదవరెడ్డి రూ. లక్ష, ఎసిరెడ్డి బాల్రెడ్డి రూ. లక్ష గ్రామాభివృద్ధి కోసం విరాళం సైతం అందజేశారు. గ్రామాభివృద్ధి కోసం విరాళాలు అందించడానికి మరింత మంది దాతలు ముందుకు వస్తున్నారు.
మండలానికే ఆదర్శం పల్లె పకృతి వనం
మండలానికే అదర్శంగా తీర్చిదిద్దిన పల్లె పకృతి వనాన్ని చూడాలంటే రేణికుంట గ్రామానికి వెళ్లాల్సిందే. రకరకాల మొ క్కలు నాటి వన్నాన్ని ఏంతో అహ్లాదకరంగా తీర్చిదిద్దారు. గ్రా మంలో డంపింగ్యార్డుతో పాటు వైకుంఠధామం, పలు అభి వృద్ధి పనులు పూర్తి చేసి సర్పంచ్ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకొస్తా..కరోనాపై పవన్కల్యాణ్