వలిగొండ, ఏప్రిల్ 17: రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మో సపోవద్దని వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కవిత అన్నారు. శనివారం మండల కేం ద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మాఅనంతరెడ్డి, సర్పంచ్ లలితాశ్రీనివాస్, వలిగొండ, అరూరు పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఉప సర్పంచ్ మ త్స్యగిరి, డైరెక్టర్లు సంజీవరెడ్డి, సత్యనారాయణ, వహీద్, డేగల పాండరి, రత్నయ్య, ప్రభాకర్, భాస్కర్, నరేందర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్17 : కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ వెంకట్రెడ్డి అన్నారు. శనివారం పెద్దకొండూర్, మందోళ్లగూడెం, నేలపట్ల, జైకేసారం, ఎస్.లింగోటం, గుండ్లబావి తదితర గ్రామాల్లోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, మార్కెట్కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజయ్య, భద్రయ్య, బుచ్చిరెడ్డి, ఆయాగ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సింగిల్విండో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
అడ్డగూడూరులో..
అడ్డగూడూరు,ఏప్రిల్ 17 : రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర్లు అన్నారు. సింగిల్విండో ఆధ్వర్యంలో మండలంలో ని వెల్ధేవి, అజీంపేట, గట్టుసింగారం, లక్ష్మీదేవికాల్వ గ్రా మాల్లో శనివారం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రా రంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ అంజయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్చంద్రయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు , ఎంపీటీసీలు , సీఈవో పాల్గొన్నారు.