రామన్నపేట, మే30: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని సిరిపురం గ్రా మం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్ర గతి కింద ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను పంచాయతీ పాలకవర్గ సభ్యులు సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామంలో రూ. 12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.60 లక్షలతో డంపింగ్ యార్డు పనులు పూర్తయ్యాయి.
గుట్టను తొలిచి.. వైకుంఠథామం..
గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వైకుంఠథామాన్ని నిర్మించారు. రోడ్డు పక్కన ఉన్న గుట్ట ప్రాంతాన్ని జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో గుట్టను తొలిచి భూమిని చదును చేసి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 12.60 లక్షల తోపాటు పంచాయతీ నిధులతో వైకుంఠధామాన్ని నిర్మించడంతోపాటు స్త్రీ, పురుషులకు వేర్వేరుగా బాత్రూంలు, వెయిటింగ్హాల్, రెండు బర్నింగ్ ప్లాట్ఫారాలు, ప్రహరీని నిర్మించారు. నిర్మాణ ప్రదేశం మధ్యలో ఉన్న పెద్ద బండరాళ్లను తొలగించి మైదానాన్ని చదును చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు.
అభివృద్ధి పనుల్లో ముందంజ..
గ్రామంలో వైకుంఠధామంతోపాటు పల్లెప్రగతిలో భా గంగా చేపట్టిన డంపింగ్యార్డ్, పల్లెప్రకృతివనం పనులు పూర్తయ్యాయి. నర్సరీని ఏర్పాటు చేశారు. వీటికి తోడు పంచాయతీ జనరల్ఫండ్, 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులతో పారిశుధ్యం మెరుగుపర్చేందుకు ప్రధాన వీధు ల్లో రూ. 30 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టారు. వీధి దీపాల నిర్వహణను మెరుగుపర్చారు. కాలనీల్లోని గుంతలను పూడ్చారు. రూ. 6లక్షలతో వాట ర్ పైప్లైన్ను ఏర్పాటు చేశారు. రెండు రెండు లక్షల లీటర్లు, ఒకటి 90వేలు, మరొకటి 40 వేల లీటర్ల సామ ర్థ్ధ్యం కలిగిన నాలుగు ట్యాంకుల ద్వారా గ్రామంలో కృష్ణా వాటర్ను ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ప్రధాన వీధుల్లో రూ. 15 లక్షలతో సీసీ రోడ్లను నిర్మించారు.
ఊరంతా పచ్చదనం..
ఆరోవిడుత హరితహారంలో భాగంగా సిరిపురం మెయిన్రోడ్డుతోపాటు, వివిధ కాలనీలు, లింక్ రోడ్ల వెంట నా టిన మొక్కలు ఏపుగా పెరిగాయి. సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు ప్రత్యేక చొరవతో రాజమండ్రి తదితర నర్సరీల నుంచి వైవిధ్యమైన మొక్కలను తెప్పించి నాటించారు. ఈ మొక్కలు ప్రస్తుతం పెరిగి కనువిందు చేస్తున్నారు. గ్రామంలోని పల్లె ప్రకృతివనం ఆకట్టుకుంటున్నది.
శుభ్రత కోసం ప్రత్యేక చర్యలు ..
గ్రామంలో పరిశుభ్రత మెరుగునకు పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇంటింటికీ తడి, పొడి చెత్త వేసే విధంగా రెండు బుట్టలను అందించారు. ప్రతిరోజూ పంచాయతీ ట్రాక్టర్ద్వారా చెత్తను సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో రోడ్లు, వీధులు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.
అందరి సహకారంతోనే అభివృద్ధి..
రెండేండ్ల కాలంలో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగ పడింది. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు అధికారులు, పంచాయతీ పాలకవర్గం సహకారంతో గ్రామంలో అభివృద్ధ్దిపనులు వేగంగా జరుగుతున్నాయి. పంచాయతీ పాలకవర్గం తీర్మానం ప్రకారం పంచాయతీ నిధులతో అభివృద్ధి పనులను చేపడుతున్నాం.
-అప్పం లక్ష్మీనర్సు సర్పంచ్, సిరిపురం