మోటకొండూర్, మార్చి 30: ప్రతి ఒక్కరూ కరోనా నిబం ధనలను పాటించాలని ఎస్సై నాగరాజు అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలో కరోనా వైరస్పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కరోనా విజృంభిస్తునందున ప్రజలంతా తప్పనిసరి గా మాస్కులు ధరించి, ప్రభుత్వ ఆంక్షలు పాటించాలన్నా రు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ప్రభాకర్, జాన్రెడ్డి, గ్రామ స్థులు భూమండ్ల శ్రీనివాస్, ఉప్పలయ్య, రఘునాథరాజు, జయరాములు, వట్టిపల్లి శ్రీనివాస్, శ్రీశైలం పాల్గొన్నారు.
వేయి రూపాయల జరిమానా
బొమ్మలరామారం: ప్రజలు బయటకు వచ్చినపుడు విధి గా మాస్కు ధరించాలని ఎస్సై వెంకన్న అన్నారు. చీకటిమా మిడి గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో మంగళవారం మా స్కు వినియోగంపై గ్రామస్థులకు అవగాహన సద స్సు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శోభ పోలీసు సిబ్బంది జనార్దన్, శ్రీను, గ్రామ స్థులు భాను, జైపాల్ రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలువిధిగా పాటించాలి
తుర్కపల్లి: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఎస్సై మధుబాబు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం కరోనాపై ప్రజ లకు అవగాహన కల్పించారు.
మాస్కులు లేకుంటే జరిమానా తప్పదు
భువనగిరి టౌన్: మాస్కులు లేకుండా బహిరం గ ప్రదేశాల్లో తిరిగితే జరిమానా తప్పదని సీఐ సుధాకర్ అన్నారు. పట్టణంలోని వినాయక చౌర స్తాలో వాహనదారులకు మాస్కులపై అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కరోనా రెండో దశ ఉదృతమవుతున్న నేప థ్యంలో వాహనదారులు, ప్రజలు భౌతికదూరం పాటించడంతో పాటు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు లేకుంటే బహిరంగ ప్రదేశాల్లో నేటి నుంచి తిరిగితే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు వాహనదారులకు మాస్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ అంజయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
ట్రేడ్ లైసెన్సుల పునరుద్ధరణకు రేపు తుదిగడువు : జీహెచ్ఎంసీ
వైరల్ అవుతున్న ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్..వీడియో