ఆలేరు టౌన్, మే 29 : ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి రావొద్దని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. ఆలేరులో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీల్లో శనివా రం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అకారణంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. విధుల్లో ఉన్న పోలీసులకు పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఏసీపీ నారాయణరెడ్డి, సీఐ నర్సయ్య ఉన్నారు.