జిల్లాలో 3,288 మంది సూపర్స్ప్రెడర్లు
భువనగిరి అర్బన్, మే 29: జిల్లాలో సూపర్స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండు రోజులుగా జరిగింది. మొత్తం 3,288 మంది సూపర్స్ప్రెడర్లు ఉండగా వ్యాక్సినేషన్ వేసేందుకు జిల్లాలో 9 కేం ద్రాలను ఏర్పాటు చేసి మొదటిరోజు 1,094 మం దికి, రెండోరోజు 1,508 మందికి టీకా వేయగా మొత్తం 2,602 మందికి పంపిణీ జరిగింది. 18 ఏండ్ల నుంచి 45 ఏండ్లలోపు వారికి టీకా పంపిణీలో భాగంగా ఇప్పటికే కొందరు సూపర్స్ప్రెడర్లుగా మొదటి డోసు టీకా తీసుకున్నారు.
కొవిడ్ వైరస్ గొలుసును తుంచి వేసేందుకు ప్రభుత్వం సూపర్స్ప్రెడర్లకు మొదటి డోస్ టీకా వేయాలని నిర్ణయించింది. జిల్లాలో వృత్తి, వ్యాపా ర రీత్యా ప్రతిరోజూ ప్రజలతో మమేకమయ్యే వారిని ప్రభుత్వం సూపర్స్ప్రెడర్లుగా గుర్తించింది. వీరిలో డ్రైవర్లు, కిరాణా, ఇతర దుకాణదారులు, రేషన్షాపు డీలర్లు, గ్యాస్ డెలివరీ సిబ్బంది, పెట్రోల్ పంపులో పనిచేసే సిబ్బంది, వీధి వ్యాపారులు, రైతుబజార్, పూలు, పండ్ల మార్కెట్లలోని విక్రేతలు, చికెన్, మాంసాహారం, చేపల విక్రయ దుకాణదారులు, ఆన్లైన్ ఫుడ్, వస్తువుల డెలివరీ బాయ్స్, మద్యం దుకాణాల్లో, సెలూన్లలో పనిచేసే సిబ్బంది జిల్లాలో మొత్తం 3,288 మందిని గుర్తించారు. శనివారం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, తహసీల్దార్ నాగిరెడ్డి పరిశీలించారు.
జిల్లాలో 3,288 మందికి..
జిల్లాలో కొవిడ్ టీకాను 3288 మందికి ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మొదటిరోజు 1,094 మందికి, రెండోరోజు 1,508 మందికి టీకా వేయగా మొత్తం 2,602 మందికి వ్యాక్సినే షన్ పంపిణీ జరిగింది. జిల్లాలో వ్యాక్సినేషన్ కేంద్రాలు 1. జడ్పీహెచ్ఎస్ మోత్కూర్, 2. జడ్పీహెచ్ఎస్, ఆత్మకూర్(ఎం), 3.ప్రభుత్వ జూనియర్ కళాశాల, భువనగిరి, 4. బీబీనగర్ హైస్కూ ల్, 5.తుర్కపల్లి, హైస్కూల్, 6. యాదగిరిగుట్టలోని పాలిటెక్నిక్ కళాశాలలో, 7. ఆలేరులోని ఏకశిల పాఠశాలలో, 8. చౌటుప్పల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, 9. జడ్పీహెచ్ఎస్ రామన్నపేటలో సెంటర్లను ఏర్పాటు చేసి రెండు రోజులుగా టీకా పంపిణీ చేశారు.
రెండోరోజు టీకా తీసుకున్న సూపర్స్రైడర్లు..
జిల్లాలో సూపర్స్ప్రెడర్లకు రెండోరోజు మొదటి టీకాను పంపిణీ చేశారు. ఇందులో పెట్రోల్ బంకు యజమానులు, సిబ్బంది, గ్యాస్ సిబ్బంది, యాజమాన్యం మొత్తం 650 మంది, జర్నలిస్టులు 146 , ఫెర్టిలైజర్స్ డీలర్స్, సిబ్బంది 393, ఎఫ్పీఎస్ సిబ్బంది 319 మొత్తం 18 ఏండ్ల నుంచి 45 ఏండ్లలోపు గల వారు మొత్తం 960 మందికి మొదటి టీకా పంపిణీ చేశారు.
మోత్కూరులో 267 మందికి..
మోత్కూరు , మే 29 : మోత్కూరు, గుండాల మండలాల్లో 267 మందికి కొవిడ్ టీకాను పం పిణీ చేసినట్లు వైద్యాధికారి చైతన్యకుమార్ తెలిపారు. శనివారం మోత్కూరు మండల కేంద్రంలో ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో సూపర్స్ప్రెడర్లకు టీకా వేసినట్లు తెలిపారు. గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 140 మందికి రెండోవిడత వ్యాక్సిన్ చేసినట్లు తెలిపారు.
ఆత్మకూరు(ఎం) లో 177 మందికి..
ఆత్మకూరు(ఎం), మే 29: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాల్లో శనివారం 177 మందికి టీకా వేసినట్లు మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు.
తుర్కపల్లిలో 128మందికి ..
తుర్కపల్లి, మే29 : మండలకేంద్రంతోపాటు జడ్పీహెచ్ఎస్లో శనివారం 128 మందికి కొవిడ్ టీకా వేసినట్లు మండల వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు. స్థానిక పీహెచ్సీలో 90 మందికి, జడ్పీహెచ్ఎస్లో తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు సంబంధించిన సూపర్స్ప్రెడర్లు 38మందికి టీకాలు వేశారు. అదే విధంగా స్థానిక పీహెచ్సీలో 20 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్గా తేలిందని వైద్యాధికారి తెలిపారు.
94 మందికి ..
రామన్నపేట: మే29: వలిగొండ, రామన్నపేట మండలాలకు చెందిన 94మంది సూపర్స్ప్రెడర్ల కు మండలకేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో టీకా వేసినట్లు మండల వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. శనివారం వ్యాక్సినేషన్ సెంటర్ను తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ ఇబ్రహీం పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్య బోధకుడు సత్యనారాయణ, ఏఎన్ఎంలు మంజుల, కవిత, గౌసియా పాల్గొన్నారు.
అడ్డగూడూరులో 193 మందికి..
అడ్డగూడూరు, మే 29 : మండలకేంద్రంలోని పీహెచ్సీలో 193 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు మండల వైద్యాధికారి నరేశ్ తెలిపారు.