జిల్లాలో రెండు సర్పంచ్, 90 వార్డు స్థానాలకు ఎన్నికలు
సన్నద్ధమవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల
ఏప్రిల్ 12న ఓటర్ల తుది జాబితా
జిల్లాలో అత్యధికంగా బీబీనగర్ మండలంలో 18వార్డులకు ఎన్నికలు
మేలో ఎన్నికలు జరిగే అవకాశం
యాదాద్రి భువనగిరి, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నగారా మోగించ బోతున్నది. ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు స్థానాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం, బొమ్మలరామారం మండలంలోని బండకాడిపల్లి సర్పంచ్ స్థానాలతోపాటు వివిధ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న 90 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఓటరు జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 12న ఓటర్ల తుది జాబితాను ప్రకటించ నుండగా, మేలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కొయ్యలగూడెం సర్పంచు స్థానంతోపాటు ఖాళీగా ఉన్న 10 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుండగా.. బీబీనగర్ మండలంలో అత్యధికం గా 18 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇన్నాళ్లుగా ఖాళీగా ఉన్న స్థానాలు త్వరలోనే భర్తీ కానుండడంతో గ్రామపంచాయతీల్లో పాలనాప రమైన ఇబ్బందులు తీరనున్నాయి.
జిల్లాలో 421 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటికి 2019 జనవరిలో మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహించారు. అయితే అప్పట్లో జరిగిన చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం పంచాయతీ ఎన్నికలను స్థానికులు బహిష్కరించారు. కొయ్యలగూడెం పరిధిలో ఉన్న ఎల్లంబాయి ఆవాసం ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటైన సందర్భంలో భౌగోళిక సరిహద్దుల విషయంలో వివాదం తలెత్తి అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. దీంతో కొయ్యలగూడెం పంచాయతీకి ఎన్నికలు జరగక సర్పంచ్తోపాటు 10 వార్డు స్థానాలు ఖాళీగా ఉండటంతో అక్కడ రెండేండ్లుగా స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతోంది.
బొమ్మలరామారం మండలం బండకాడిపల్లి పంచాయతీ సర్పంచ్ ఏడాది క్రితం మరణించడంతో ఉప సర్పంచ్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే వివిధ కారణాలతో జిల్లాలోని వివిధ పంచాయతీల్లో 41 వార్డు స్థానాలు ఖాళీ అయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేసిన వ్యయాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 49 మందిపై అనర్హత వేటు పడటంతో ఆయా స్థానాలు సైతం ఖాళీ అయ్యాయి. త్వరలోనే రెండు సర్పంచ్, 90 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. మూడు రోజుల క్రితమే ఓటరు జాబితాకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేయగా.. ఏప్రిల్ 4న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించి ఏప్రిల్ 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి ఏప్రిల్ 12న తుది జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం ఎన్నికల నిర్వహణకు తేదీలను ఖరారు చేసి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేయనుంది.
అనర్హతతో ఖాళీ అయిన వార్డులు
అడ్డగూడూరు మండలంలోని చిన్నపడిశాల (4వ వార్డు), గట్టుసింగారం (9వ వార్డు), కొండంపేట్ (4, 6వ వార్డు), బీబీనగర్ మండలంలోని భట్టుగూడ(5, 6, 7 వార్డులు), గుర్రాలదండి (2వ వార్డు), జమీల్పేట్ (1వ వార్డు), జాంపల్లి (7వ వార్డు), జియాపల్లి (1, 7, 8 వార్డులు), రాఘవాపూర్ (7వ వార్డు), వెంకిర్యాల(1, 10వ వార్డు), ఎర్రబెట్టుతండా (5వ వార్డు), గుండాల మండలంలోని బండకొత్తపల్లి (1, 2, 4, 5, 8 వార్డులు), గుండాల(4, 8, 9వ వార్డులు), నూనెగూడెం(7వ వార్డు), వెల్మజాల (1, 3, 10వ వార్డులు), మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెం (7వ వార్డు), పాలడుగు (6వ వార్డు), సదర్శాపూర్ (1, 5, 7, 8వార్డులు), నారాయణపురం మండలంలోని కడీలబావితండా (3వ వార్డు), కొర్రతండా(5వ వార్డు), వెంకంబావితండా (2వ వార్డు), రామన్నపేట మండలంలోని కొత్తగూడెం (7, 8వ వార్డులు), కుంకుడుపాముల (6వ వార్డు), నిదాన్పల్లి (2వ వార్డు), సిరిపురం (12వ వార్డు), ఉత్తటూర్ (3, 4, 5, 6, 7, 8వార్డులు).
వివిధ కారణాలతో ఖాళీ అయిన వార్డులు
అడ్డగూడూరు మండలంలోని గోవిందాపురం(4వ వార్డు), ఆలేరు మండలంలోని కొల్లూర్(1వ వార్డు), రాఘవాపూర్(6వ వార్డు), భువనగిరి మండలంలోని ఆకుతోటబాయితండా (8వ వార్డు), సిరివేణికుంట (2వ వార్డు), బీబీనగర్ మండలంలోని గుర్రాలదండి (7వ వార్డు), జియాపల్లితండా (2, 3వ వార్డులు), మగ్ధుంపల్లి (2వ వార్డు), రహీంఖాన్గూడెం (3వ వార్డు), బొమ్మలరామారం మండలంలోని కంచల్తండా (7వ వార్డు), మైసిరెడ్డిపల్లి (2వ వార్డు), రామలింగంపల్లి (2వ వార్డు), తూముకుంట (7వ వార్డు), చౌటుప్పల్ మండలంలోని కోయలగూడెం పంచాయతీలోని 10 వార్డులు, చింతలగూడెం (2, 4వార్డులు), గుండాల మండలంలోని మసాన్పల్లి (2వ వార్డు), మోటకొండూరు మండలంలోని అమ్మనబోలు (8వ వార్డు), చామాపూర్ (5వ వార్డు), ముత్తిరెడ్డిగూడెం (1వ వార్డు), రాజాపేట మండలంలోని కుర్రారం (2వ వార్డు), రామన్నపేట మండలంలోని రామన్నపేట (6వ వార్డు), సూరారం (1, 5వ వార్డులు), తుర్కపల్లి మండలంలోని గొల్లగూడెం (7వ వార్డు), జేతూరామ్తండా (5వ వార్డు), మోతీరామ్తండా (4వ వార్డు), వీరారెడ్డిపల్లి (6వ వార్డు), వలిగొండ మండలంలోని అక్కంపల్లి (4వ వార్డు), నర్సాయిగూడెం (3వ వార్డు), సుంకిశాల(7వ వార్డు).
ఓటర్ల తుది జాబితా తయారీకి సన్నాహాలు
జిల్లాలో రెండు సర్పంచ్, 90 వార్డు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వీటికి త్వరలోనే ఎన్నికలు జరిపేందుకు సంకల్పించి ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ను విడుదల చేసింది. ఏప్రిల్ 12న తుది జాబితాను ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.
ఇవి కూడా చదవండి
భారత్లో విడుదలైన వివో X60 సిరీస్ స్మార్ట్ఫోన్లు
పొకో F3, పొకో X3 ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్