బాలాలయంలో సుదర్శన నారసింహ మహాయాగం
కరోనా నేపథ్యంలో స్వామి వారి సేవల్లో భక్తులకు అనుమతి నిరాకరణ
యాదాద్రి, మార్చి 29: పంచ నారసింహుడిగా విరాజిల్లు తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో యాదాద్రీశుడికి ఉదయం నాలుగు గంటల నుంచి నిత్యా రాధనలు మొదలయ్యాయి. సోమవారం వేకువజామునే స్వామివారిని బాలాలయంలో కవచమూర్తులకు ఆరాధన లు జరిపి, పంచామృతాలతో నిజాభిషేకం నిర్వహించారు. అనంతరం తులసి అర్చనలు జరిపి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. లక్ష్మీనరసింహుడి బాలాలయంలో సు దర్శన నారసింహ మహాయాగం జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవ తంతు అత్యంత వై భవంగా చేపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేప థ్యంలో స్వామివారి సేవల్లో భక్తులకు అనుమతి ఇవ్వలేదు. నిత్య కైంకర్యాలు నిరాడంబరంగా నిర్వహించారు. సాయం త్రం అలంకార జోడు సేవలు, మండపంలో అష్టోత్తర పూ జలు జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిం చారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
రుద్రాభిషేకం..
యాదాద్రీశుడి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్దనీ సమేత రామలింగేశ్వరస్వామికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిరాడంబరంగా నిర్వహించారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే పరమ శివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మ ణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు. కరోనా నేపథ్యంలో రుద్రాభిషేకంలో భక్తులకు అనుమతినివ్వలేదు.
ఖజానాకు రూ.5, 25,613 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. .5, 25,613 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 30,600, రూ. 100 దర్శనాలతో రూ. 6,900, వీఐపీ దర్శనాలతో రూ. 33,750, ప్రచారశాఖ ద్వారా రూ. 800, క్యారీ బ్యాగుల తో రూ. 4,200, వ్రతాలతో రూ. 17,500, కల్యాణకట్టతో రూ.16,100, ప్రసాద విక్రయాలతో రూ. 3,18,515, శాశ్వత పూజలతో రూ. 16,116, వాహన పూజలతో రూ. 5,200, టోల్గేట్ ద్వారా రూ. 1,310, అన్నదాన విరా ళంతో రూ. 8,360, యాదరుషి నిలయంతో రూ. 40, 200, ఇతర విభాగాలతో రూ. 26,062తో కలిపి రూ.5, 25,613 ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు.