భువనగిరి అర్బన్, ఏప్రిల్ 28: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఎంపీపీ నరాల నిర్మల అన్నారు. మండలంలోని బీఎన్.తిమ్మాపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, ఎంపీటీసీ ఉడుత శారదాఆంజనేయులు, సర్పంచ్ పిన్నెం లతరాజు, ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ ఉడుత మహేందర్, కో-ఆప్షన్ మెంబర్ ఉడుత కవిత, గ్రామస్తుడు మైసయ్య, రైతులు పాల్గొన్నారు.
ప్యారారంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
బొమ్మలరామారం,ఏప్రిల్ 28: మండలంలోని ప్యారారం గ్రామంలో ధీశాలి రైతు మహిళా ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, గ్రామీణ మహిళా మండలి అధ్యక్షురాలు డి.విజయలక్ష్మి మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిమ్ముల రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిడి రాంరెడ్డి, శ్రీనువాస్ నాయక్, నర్సింహారెడ్డి, మధుసూదన్రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ,కిశోర్కుమార్, ఆర్ఎస్ఏ నాబార్డు గంగాధర్, ధీశాలి రైతు సంస్థ డైరెక్టర్ చంద్రకళ, సీఈవో హరిలాల్ , రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 28: మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎంపీడీవో ఆవుల రాములు పరిశీలించారు.ఆయన వెంట సర్పంచ్ జన్నాయికోడె నగేశ్, ఎంపీటీసీ యాస కవిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఇంద్రారెడ్డి ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
బొమ్మలరామారం/తుర్కపల్లి,ఏప్రిల్ 28: కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది పాండరిగౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు పెద్దతండా, పల్లెపహాడ్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయ న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ భిక్కూనాయక్, ఎంపీపీ భూక్య సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, ఏపీవో దుర్గేశ్వరి,మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ రహమాన్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొమశెట్టి నర్పింహ, మాజీ ఎంపీపీ బబ్బూరి రవీందర్నాథ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దు నాయక్, నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలి
ఆలేరు టౌన్, ఏప్రిల్ 28 : ఆరబెట్టి, తాలు లేని ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మార్కెట్ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్ కోరారు. ఆలేరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట మార్కెట్ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, మార్కెట్ సెక్రటరీ చంద్రశేఖర్, బైరి మహేందర్ ఉన్నారు.
ధాన్యం తుకాలను వేగంగా చేపట్టాలి
మోత్కూరు,ఏప్రిల్ 28 : రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం తుకాలను వేగంగా చేపట్టాలని మోత్కూరు రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి అన్నారు. బుధవారం మోత్కూరు మండల పరిధిలోని పొడిచేడు, బుజిలాపురం, పనకబండ గ్రామాల్లో సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తూకాలైన ధాన్యం ఎగుమతులు కాకుండా నిలిచి పోవడంతో ఆయన జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి రవాణా వసతి కల్పించారు. రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాంపాక నాగయ్య, పనకబండ సర్పంచ్ బత్తిని తిరుమల్లేశ్, పొడిచేడు సర్పంచ్ పేలపుడి మధు, సంఘం వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పద్మారెడ్డి, ఉప సర్పంచ్ కప్పె వెంకటేశం, సిబ్బంది పాల్గొన్నారు.