రామన్నపేట, ఏప్రిల్ 27: శానిటైజేషన్ ఉత్పత్తులు తయారు చేసి పాఠశాలలకు తక్కు వ ధరకు సరఫరా చేయడంతోపాటు మరో నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది మండల కేంద్రానికి చెంది న బైరబోయిన రాజిక. రామన్నపేట ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ఆమె 10మంది మహిళలతో కలిసి ప్రవళిక సమభావన సంఘాన్ని ఏర్పాటు చేసింది. మొదట్లో మిగిలిన సంఘాల మాదిరిగా నెలనెలా పొదుపు చేయడం, బ్యాం కు రుణాలు చెల్లించడానికి పరిమితమైంది. 2017లో నియోజకవర్గం వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఉద్దీపన’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలకు అవసరమైన శానిటైజేషన్ ఉత్పత్తులను సమభావన సంఘాల ద్వారానే సరఫరా చేయించాలనే ఉద్దేశంతో మండలానికి ఒక సంఘాన్ని ఎంపిక చేశారు. ఎంపిక చేయబడిన మహిళా సంఘం సభ్యులు రాజేంద్రనగర్లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ పొం దారు. అలా శిక్షణ పూర్తి చేసుకున్న సంఘాల్లో రామన్నపేటకు చెందిన ప్రవళిక మహిళా సం ఘం ఒకటి.
ఉత్పత్తులకు మంచి ఆదరణ
ప్రవళిక సమభావన సంఘంలోని నలుగురు సభ్యులు కలిసి ఫినాయిల్, టాయిలెట్క్లీనర్, హ్యాండ్వాష్, ఫ్లోర్క్లీనర్, శానిటైజర్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఇందుకోసం రూ. 2లక్షలు బ్యాంకు రుణం తీసుకున్నారు. ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలలకు తక్కువ ధరకు సరఫరా చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గృహవినియోగదారులకు కూడా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ షాపింగ్కాంప్లెక్స్లో స్టోర్ను ఏర్పాటు చేశారు. బహిరంగ మార్కెట్లో లభ్యమయ్యే ధరకంటే సుమారు 20శాతం తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. లాభాలు తక్కువగా ఉండడంవల్ల నలుగురికి రోజువారీ కూలి కూడా గిట్టుబాటు కాకపోవడంతో ఒక్కరే నిర్వహించాలని నిర్ణయించి బైరబోయిన రాజికకు ఆ బాధ్యతను అప్పగించా రు. కరోనా సమయంలో ఉత్పత్తులకు మం చి ఆదరణ లభించింది. నాణ్యత, మన్నికతో కూడిన వీరి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి బైరీసన్స్ ఆగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. స్త్రీనిధి ద్వారా రుణం పొందిన రాజిక మరో నలుగురి సహాయంతో శానిటైజేషన్ ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తూ స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరో నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
రాజికకు 2021 ప్రతిభా పురస్కారం
ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 2021 సంవత్సరానికిగాను రాజికకు ప్రతిభా పురస్కారం ప్రకటించింది. మార్చి8, 2021న భువనగిరిలో జరిగిన కార్యక్రమంలో డీఆర్డీవో మందడి ఉపేందర్రెడ్డి ఆమెకు ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత మందికి ఉపాధి
ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉన్నది. నాణ్యతతో ఫినాయిల్, టా యిలెట్క్లీనర్, హ్యాండ్వాష్, ఫ్లోర్క్లీనర్, శానిటైజర్లను తక్కువ ధరకు విక్రయిస్తున్నాం. ప్రస్తు తం వచ్చే ఆదాయంతో సంత్పప్తి చెందుతున్నా. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మా ఉత్పత్తుల ను వాడే విధంగా సర్కార్ ఉత్తర్వులు ఇవ్వాలి. దీంతో మరికొంత మందికి ఉపాధి కల్పిస్తాం. మమ్ములను ప్రోత్సహిస్తున్న అధికారులు, నా యకులకు కృతజ్ఞతలు.
-బైరబోయిన రాజిక, ప్రవళిక మహిళా సంఘం సభ్యురాలు