భువనగిరి అర్బన్, జూన్ 28: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు జిల్లా అధికారులు అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందజేయాలని కలెక్టర్ పమే లా సత్పతి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమ వారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిం చారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు సంబంధింత, సంబంధిత శాఖలు సకాలంలో శాఖా పరమైన అనుమతులు నిబంధనల మేరకు వెంటనే మంజూరు చేయాల ని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి 15 రోజులకు ఒక సారి సమావేశమై పరిశ్రమల స్థాపనకు క్లియరెన్సులు జారీ చే యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో విరి విగా పరిశ్రమల స్థాపకు అన్ని చర్యలు తీసుకోవాలని ఎటువం టి సమస్యలున్నా తక్షణమే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఇతర లబ్ధిదారులకు, ఔత్సాహికులకు ప్రభుత్వ ప రంగా సబ్సీడీలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావ రణం, విద్యుత్, పొల్యూషన్, నీటి సరఫరా, ముడిసరుకుల సరఫరా తదితర అవసరాలకు అనుమతులు సకాలంలో జారీ చేసి పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, ఎల్డీఎం నా గార్జునబాబు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ శ్యామ్సుందర్, గిరిజన సంక్షేమ అధికారి మంగ్తానాయక్, ఎక్సైజ్శాక జిల్లా అధికారి కృష్ణప్రియ, పోల్యూషన్ ఈఈరాజేందర్, టీఎస్ఐఐసీ శారద, హెచ్ఎండీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో ఆర్జీల స్వీకరణ
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పలువురు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ పమేలా సత్తతికి ఆర్జీలు అందజేశారు. నూతన కలెక్టర్గా బాద్యతలు స్వీకరించిన మొద టి సోమవారం రోజన 75 మంది తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్కు వినతులు అందజేశారు. భూ సమస్యల పైన ఎక్కువగా ఈ ఆర్జీలు వచ్చాయన్నారు. మాజీ సైనికులు విర మణ తర్వాత తమకు అందాల్సిన సౌకర్యాలు కల్పించాలని కో రినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, ఆర్డీవో భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దోభీఘాట్ మంజూరు చేయాలని వినతి
చౌటుప్పల్ రూరల్: మండల పరిధిలోని నేలపట్ల గ్రామంలో రజకులకు దోభీఘాట్ మంజూరు చేయాలని ఎంపీటీసీ తడక పారిజాత సోమవారం కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం సమర్పించారు. దోభీఘాట్ లేక రజకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.