యాదాద్రి, జూన్28: సీఎం కేసీఆర్ దళిత పక్షపాతిగా నిలుస్తున్నారని, దళితులు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని మున్సిపల్ కౌన్సిలర్ బూడిద సురేందర్, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేపాక స్వామి అన్నారు. రూ.1200కోట్లతో సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టడా న్ని స్వాగతిస్తూ సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకంతో దళితులు ఆత్మగౌరవంతో జీవించొచ్చన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీలను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో సామాజిక తెలంగాణ సాధ్యమన్న కేసీఆర్, ఆ దిశగా అడుగులు వేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వంగపల్లి ఎంపీటీసీ రేపాక మౌనికామహేందర్, నాయకులు పాపట్ల నరహరి, పులెపాక అశోక్, పులెపాక భిక్షపతి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ చల్లూరి స్వామి, కందుల మల్లేశం, నమిలే ఆంజనేయులు, మోత్కుపల్లి భిక్షపతి, బర్ల శివ య్య, రాజు, కొన్నె వెంకటేశ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
దళిత సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ సోమవారం మండల కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో దళిత నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పడవ శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళిత కుటుంబాల అభున్నతికి రూ.1200 కోట్లను కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపా రు. కార్యక్రమంలో జడ్పీవైస్చైర్మన్ భిక్కూనాయక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశట్టి నర్సింహులు, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు లచ్చయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాంగాల కిష్టయ్య, కో-ఆప్షన్ సభ్యుడు రహమత్ షరీప్, సర్పంచ్ పడాల వనితాశ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, సోషల్మీడియా నియోజకవర్గ కన్వీన శ్రీకాంత్, యాకుబ్, గురువయ్య, చంద్రమౌళి, ముత్యాలు తదితరులున్నారు.
దళితుల అభ్యున్నతికి…
బొమ్మలరామారం, జూన్ 28: రాష్ట్రంలో దళితుల అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకాన్ని ప్రకటించడాన్ని హర్షిస్తూ టీఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మైలారం రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషే కం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దళితులు ఎన్నో ఏండ్లుగా ఆర్థికంగా, సామాజిక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటి ని పరిష్కరించేందుకు గత ప్రభుత్వాలు చొరవ చూపలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభున్నతికి అధిక ప్రాధాన్యమిచ్చి అండగా ఉం టున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల పార్టీ అధ్యక్షుడు పోలగాని వెంకటేశ్ ,ఎంపీటీసీ మడిగె నర్సింగ్రావు, మండల నాయకులు ఈప్పలపల్లి నరేందర్, తొంట సత్యనారాయణ, బాణాల బాలనర్సింహ్మ, వుట్ల నర్సింహ్మ, సరగాల మైసయ్య, ఐలయ్య, గణేశ్, యాదగిరి, పాపిరెడ్డి, మహేశ్, యాదగిరి, శ్రీకాంత్ ,రమేశ్, రాజు పాల్గొన్నారు.
దళితుల జీవితాల్లో వెలుగులు..
సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమానికి దళిత సాధికారత పథకాన్ని ప్రకటిం చడాన్ని హర్షిస్తూ మోత్కూరు మండల టీఆర్ఎస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం మం డల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, తుం గతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ చిత్ర పటా లకు క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్నాథ్ కొనియాడారు. దళితుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, ఈ సం దర్భంగా సీఎం కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సోంమల్లు, సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ నాగయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీను, మాజీ సర్పంచ్లు వీరస్వామి, వీరస్వామి, గ్రంథాలయ కమిటీ చైర్మన్ మత్స్య గిరి, విక్రాంత్, యాదిరెడ్డి, రఘుపతి, చంద్ర య్య, తిరుమలేశ్, వెంకన్న, వెంకన్న, పరశురా ములు, లింగం, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
తెలంగాణలో దళితుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం వచ్చే నాలుగేండ్ల లో రూ.40వేల కోట్లను వెచ్చిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొనడం హర్షణీయమని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు అన్నా రు. సోమవారం ఆయన ఆలేరులో విలేకరులతో మాట్లాడారు. దళిత సాధికారత స్కీం కింద ఎం పిక చేసే ఒక్కో దళిత కుటుంబానికి బ్యాంకు ఖాతాలో రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషం గా ఉందన్నారు. దళితుల సంక్షేమానికి సీఎం కేసీ ఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నాడని కొనియాడారు.
అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం
మోటకొండూర్, జూన్ 28: రాష్ట్రంలో అన్ని వర్గా ల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు బోడ మహేశ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు రూ.10లక్షల సీఎం సాధికారత పథకంతో ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్, ప్రభు త్వ విప్ గొంగిడి దంపతుల చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం ప్రవేశపెట్టారన్నారు. దళితుల అభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో మోటకొండూర్ అంబేద్కర్ సం ఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లూరి యాదగిరి, మాజీ ఉపసర్పంచ్ బోట్ల నర్సింహ్మ, పూసల సంఘం మండలాధ్యక్షుడు పన్నీరు గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు బోట్ల పాండు, గంధమల్ల మధు, బోట్ల మహేశ్, బందెల శివ పాల్గొన్నారు