రామన్నపేట: కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని ఎంపీటీసీ ల ఫోరం మండలాధ్యక్షుడు తిమ్మాపురం మహేందర్రెడ్డి అ న్నారు. గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆ దేశానుసారం మండలంలోని సర్నేనిగూడెం గ్రామంలో కరోనా బాధితులు 12 మందికి ఒక్కొక్కరికి రూ.2,500ల చొప్పున ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్రెడ్డి తన సొంత నిధులను అందజేశారు. గ్రామపంచాయతీ సిబ్బందికి, ఆశలకు శానిటైజ ర్లు, మాస్కులను సర్పంచ్ ధర్నె రాణి అందజేశారు. కార్యక్ర మంలో ఏఎన్ఎం పావని తదితరులు పాల్గొన్నారు.
మాస్కులు, శానిటైజర్లు పంపిణీ
రాజాపేట: మండల కేంద్రంలో ఎస్సీ గ్రూపు అధినేత పుల్లూరి వెంకటేశం గుప్తా ఆధ్వర్యంలో గురువారం పోలీసులకు, ఉపా ధిహామీ కూలీలకు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 1500 మాస్కులు, 5లీటర్ల శానిటైజర్ క్యాన్లు 10, 100 ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్రెడ్డి, సర్పంచ్ ఈశ్వరమ్మ, ఎంపీటీసీ రాజు, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి గుప్తా, ప్రధాన కార్యదర్శి సంతోశ్కుమార్, సీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ ఉపేందర్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
అడ్డగూడూరు: మండలంలోని గట్టుసింగారానికి చెందిన సట్టు పరుశురాములు కరోనాతో మృతిచెందాడు. అతడికి ముగ్గురు చిన్నపిల్లలు ఉండడంతో జిల్లా మహిళ సంక్షేమశాఖ పీడీ కృష్ణవే ణి సూచనల మేరకు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సైదులు ఆదే శాలతో గురువారం ఐసీడీఎస్ సూపర్వైజర్ మధురమ్మ, ప్రొ టెక్షన్ ఆఫీసర్ కవిత వారి ఇంటికి వెళ్లి పిల్లల యోగక్షేమాలు తె లుసుకుని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమం లోసర్పంచ్ సత్తయ్య, ఉప సర్పంచ్ ఎల్లయ్య పాల్గొన్నారు.
పోలీసులకు భోజనం ప్యాకెట్లు అందజేత
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై ఏ ర్పాటు చేసిన పోలీసు చెక్పోస్ట్ వద్ద పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పం చ్ గనగాని మాధవి గురువారం పోలీసులకు భోజనం ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సై ఎండీ ఇద్రీస్అలీ, ఆత్మకూ రు(ఎం) మాజీ సర్పంచ్ చందర్గౌడ్, టీఆర్ఎస్ మండల నా యకులు మల్లేశం గౌడ్, దశరథగౌడ్ పాల్గొన్నారు.
మందనపల్లిలో..
ఆలేరురూరల్: మండలంలోని మందనపల్లిలో కరోనా బాధిత కుటుంబాలకు గురువారం బీర్ల ఫౌండేషన్ సభ్యులు ఇంటింటి కీ తిరిగి నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లావణ్య, సురేశ్, అఖిల్, యాదగిరి, సత్యనారాయ ణ, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పల్లెపహాడ్లో..
మండలంలోని పల్లెపహాడ్లో కరోనా వైరస్తో మృతి చెందిన మృతుని కుటుంబానికి గురువారం టీఆర్ఎస్ నాయకులు ని త్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎం పీపీ మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్, నాయకులు రా మచంద్రయ్య, నర్సయ్య, మహేశ్, నవీన్ పాల్గొన్నారు.
ఆశలకు మెడికల్ కిట్లు అందజేత
మండలంలోని కొరటికల్లో ఆశలతో పాటు గ్రామంలోని 20 మందికి గురువారం గ్రామానికి చెందిన శ్రీరాముల ప్రకాశ్ యాత్రి సహకారంతో కరోనా మెడికల్ కిట్లు అందజేశారు. ఆ యన వెంట ఉదయ్కుమార్, సందీప్ తదితరులు ఉన్నారు.
ఆహార ప్యాకెట్లు పంపిణీ
భువనగిరి అర్బన్: 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి, ఎన్ఐ ఆర్ వాసవి అసోసియేషన్ ప్రెసిడెంట్స్ హరిరాయిని, శ్రీనివా స్, జనరల్ సెక్రటరీ రవి, ట్రెజరర్ కరుమూర్తి, శ్రీధర్, రవి స హకారంతో పట్టణంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్లలోని వారికి మహేశ్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో దయాకర్, సంకీర్త్ పాల్గొన్నారు.
పోలీసులకు భోజనాలు
బొమ్మలరామారం:మండలంలోని రంగాపూర్ వద్ద పోలీసు సిబ్బందికి మాచన్పల్లి ఉపసర్పంచ్ వై.నరేందర్ రెడ్డి ఆధ్వర్యం లో గురువారం భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో మాచ న్పల్లి యువకులు భానుచందర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.