యాదాద్రి భువనగిరి, మే 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించి అమలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలన్నా, ఇతర రాష్ట్రాలకు పోవాలన్నా ఈ పాస్ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. అయితే చాలా మంది ఈ విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే తప్పనిసరి..
ఎలా తీసుకోవాలంటే..
రాష్ట్రంలో లాక్డౌన్ ఈ నెల 30 వరకు ఉన్నది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపులో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోళ్లు, ఇతర అవసరాలు తీర్చుకోవచ్చు. ఈ సమయంలో ఎలాంటి పాస్లు అవసరం లేదు. ఆ తర్వాత కచ్చితంగా పాస్లు ఉండాల్సిందే. ప్రభుత్వం తెలిపిన అత్యవసర సేవలు, అంబులెన్స్లు ఇతర అనుమతి ఉన్న శాఖల ఉద్యోగులకు ఈ పాస్లు అవసరం లేదు. వారి గుర్తింపు కార్డులుంటే సరిపోతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే ఈపాస్ ఉండాల్సిందే. అలాగే శుభకార్యాలు, అంత్యక్రియలు ఇతర కార్యక్రమాలకు కూడా డీఎస్పీ కార్యాలయం నుంచి అనుమతులు తీసుకోవాల్సిందే. తెలంగాణ ప్రజలు ఎవరైనా http:// policeportal. tspolice.gov.in ద్వారా ఈ పాస్కు దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవచ్చు. పోలీస్ శాఖకు సరైన ఆధారాలు చూపించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారు వాటిని పరిశీలించి అనుమతులు జారీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలంటే (http:// appolice.gov. in), ట్విట్టర్లో (@ APPOLICE100), ఫేస్బుక్లో (@ ANDHRA PRADESH STATEPOLICE) అలాగే తమిళనాడులో https://eregister. tnega.org/ ఒడిశాలో ttps://covid19regd. odisha.gov.in ద్వారా అనుమతులు పొందవచ్చు.