యాదాద్రి భువనగిరి, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓ వైపు లాక్డౌన్తో కొవిడ్ చైన్ను తెంపేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఎక్కడికక్కడ మహమ్మారిని అడ్డుకునేందుకు పకడ్బందీగా రెండో విడుత జ్వర సర్వేను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో ఇంటింటికీ వెళ్తున్న 757 వైద్య బృందాలు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నా యి. కొవిడ్ అనుమానితులను గుర్తించి హెల్త్ కిట్లను అందజేయడంతోపాటు బాధితుల్లో మనోధైర్యాన్ని నింపుతున్నా యి. మూడు రోజుల్లో జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో ఉన్న 1,52,824 ఇండ్లల్లో వైద్య బృందా లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాయి. ఈ సందర్భంగా జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు తదితర లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి 4,628 మందికి హెల్త్ కిట్లను అందజేశారు. 21 పీహెచ్సీల్లో కొనసాగుతున్న ఓపీ సేవల సందర్భంగా గుర్తించిన 990 మందికి సైతం హెల్త్ కిట్లను అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్, మే 25 : కొవిడ్కు భయపడాల్సిన అవసరం లేదని, మనోధైర్యంతో మందులు వాడి వైద్యుల సూచనలు పాటిస్తే ఆ వైరస్ను నియంత్రించొచ్చని యాదగిరిగుట్ట ఎంపీడీవో కారం ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సైదాపురం, గౌరాయపల్లి గ్రామాల్లో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల్లో జ్వర సర్వే కొనసాగుతుందని, ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి కొవిడ్ మందుల కిట్లను అందజేయాలని వైద్యసిబ్బంది, ఆశవర్కర్లకు సూచించారు. ప్రజ లు అత్యవసరమైతేనే బయటికి రావాలని, ఆ సమయంలో నూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని కోరారు. కొవిడ్ కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరా రు. అనంతరం గౌరాయపల్లి గ్రామంలో నర్సరీ, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమం లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
తుర్కపల్లి, మే25: మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో మంగళవారం రెండో విడుత జ్వర సర్వేను ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు నిర్వహించారు. వాసాలమర్రి గ్రామంలో జరిగిన జ్వర సర్వేలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొవిడ్ వైరస్తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వైద్య సిబ్బందిని కలిసి మందులు తీసుకోవాలని సూచించారు.
బీబీనగర్, మే 25 : మండలంలో రెండో విడుత జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందులను అందజేశారు. ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు.
అడ్డగూడూరు, మే 25: మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో మంగళవారం రెండోవిడత జ్వర సర్వేను అం గన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను సేకరించారు. జ్వరం , జలుబు , దగ్గు, ఒంటి నొప్పులు వం టి లక్షణాలు ఉన్న వారికి మందుల కిట్లను అందజేశారు.
ఆలేరు టౌన్, మే25 : ఆలేరు పట్టణంలో మంగళవారం జ్వర సర్వేను అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది నిర్వహించారు. సర్వేలో భాగంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ని తెలుసుకున్నారు. కాగా భారత్నగర్లో వారం రోజులుగా ఓ వ్యక్తి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. గుర్తించిన సర్వే సిబ్బంది 108కి సమాచారం ఇచ్చి అతడిని దవాఖానలో చేర్పించారు.
రామన్నపేట, మే25: రెండో విడుత జ్వర సర్వే మండలంలో మూడోరోజూ జరిగింది. మంగళవారం ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని నమోదు చేసుకున్నారు. దగ్గు, జ్వరం ఉన్న వారిని గుర్తించి మందులను పంపిణీ చేసి పలు సూచనలు చేశారు. సర్వేను మండల వైద్యాధికారి రవికుమార్ పర్యవేక్షించారు.
వలిగొండ, మే 25: మండలంలో అన్ని గ్రామాల్లో ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో రెండో విడుత ఇంటింటి జ్వర సర్వేను మూడోరోజూ మంగళవారం నిర్వహించారు. 40 బృందాలతో నిర్వహించిన ఇంటింటి సర్వేలో 3,626 ఇం డ్లకు వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 102 మందిలో స్వల్ప జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 46 మందికి మెడికల్ కిట్లను అందజేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
ఆత్మకూరు(ఎం), మే 25 : మండల కేంద్రంతోపాటు అని గ్రామాల్లో రెండో విడు త జ్వర సర్వేను ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇం టింటికీ తిరిగి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేసుకున్నారు. జలు బు, దగ్గు లాంటి లక్షణాలుంటే తమకు తెలపాలని ప్రజలకు సూచించారు. ఈ సర్వేను మండల ప్రత్యేకాధికారి శ్యామ్సుందర్ పర్యవేక్షించారు. ఆయన వెంట ఎంపీడీవో ఆవుల రాములు, మురిపిరాల సర్పంచ్ తిరుమల్రెడ్డి, కృష్ణస్వామి, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
భువనగిరి టౌన్, మే 25 : రెండో విడుత జ్వరసర్వేకు ప్రజలందరూ సహకరించాలని కౌన్సిలర్ పోత్నక్ ప్రమోద్కుమార్ అన్నారు. పట్టణంలోని హౌసింగ్బోర్డులో మంగళవా రం నిర్వహించిన జ్వర సర్వేలో ఆయన పాల్గొని మాట్లాడా రు. జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలున్న వారిని గుర్తించి వారికి మందులు అందజేయడంతోపాటు అవసరమైన వారిని దవాఖానకు వైద్య సిబ్బంది తరలిస్తారని చెప్పా రు. ప్రతి ఒక్కరూ వైద్య సిబ్బందికి సహకరించాలని కోరా రు. కార్యక్రమంలో స్థానికులు బాలేశ్వర్, నరసింహారావు, రమణ, నవనీత, సురేఖ పాల్గొన్నారు.