ఆత్మకూరు(ఎం), మే 25: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా ఉపాధి కూలీలు కేవలం కంపచెట్లను తొలగించి వరద కట్టలు, మట్టి రోడ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా నీటి సంరక్షణ కోసం ఆత్మకూరు(ఎం)లో 4 చో ట్ల వరద కాల్వల నిర్మాణం పనులు చేపట్టారు. వరద నీటి తో పాటు చెరువులు, కుంటలు పొంగి పొర్లినప్పుడు ప్రవ హించే నీరు వరద కాలువల నుంచి ప్రవహించడంతో పా టు చెరువులు, కుంటల్లోకి పోయేవిధంగా గొలుసుకట్టు వర ద కాలువల నిర్మాణం పనులు ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
4చోట్ల వరద కాలువల నిర్మాణం
నెల రోజుల నుంచి ప్రతిరోజు 150 నుంచి 200 మంది ఉపాధిహామీ కూలీలతో ఆత్మకూరు(ఎం)లో 1. రంగ శివ లింగయ్య ఇంటి నుంచి కొత్త చెరువు వరకు 1000 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పుతో కాలువ నిర్మాణం చేపట్టారు. 2.బిక్కేరు వాగు నుంచి వీర్ల చెరువు వరకు 1500 మీటర్ల పొడవు, 4 నుంచి 6 మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేపట్టా రు. 3.మసిరెడ్డి కుంట నుంచి సిలోను బావి మీదుగా వీర్ల చెరువు వరకు 1500 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో కాలువ నిర్మాణం చేపట్టారు. 4. పాత బీరప్ప గుడి నుంచి కొరటికల్ బిక్కేరు వాగు నుంచి వెంకటేశ్వర కుంట వరకు 1500 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో పంట కాలువ నిర్మాణం చేపట్టారు.