యాదాద్రి, మే 25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆల యంలో ఈ నెల 23న ప్రారంభమైన నృసింహుడి జయం తి ఉత్సవాలు మంగళవారం రాత్రి నృసింహ ఆవిర్భావం తో ముగిశాయి. ఉదయం 7 గంటలకు బాలాలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించి, పూర్ణాహుతి నిర్వహిం చారు. అనంతరం స్వామివారికి సహస్ర ఘటాభిషేకం మ హా వైభవంగా జరిపారు. తొలుత 1000 కలశాలను ఆల య మహా మండపంలో పేర్చిన అర్చకులు వాటితో శుద్ధ జలంచ సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలను నింపి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు ఆల యంలో అర్చకులు నృసింహ జయంతి వేడుక జరపించి, నృసింహ ఆవిర్భావ నివేదన, తీర్థ ప్రసాద గోష్టి చేపట్టి ఉ త్సవాలకు ముగింపు పలికారు. పాతగుట్ట శ్రీపూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూర్ణాహుతి అష్టోత్తర సహ స్ర ఘటాభిషేకం, నృసింహ జయంతి- నృసింహ ఆవిర్భా వ వేడుకలు అత్యంత వైభవంగా జరిపారు.
స్వామి వారి దివ్యక్షేత్రంలో స్వాతి నక్షత్ర పూజల అర్చకులు కోలహలం గా నిర్వహించారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఐదు న్నర వరకు గిరిప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఆలయం లో మూడున్నర గంటల పాటు శ్రీవారి అష్టోత్తర సహస్ర ఘటాభిషేకం కనుల పండువగా జరిగాయి. స్వామివారి నిత్యారాధనలు నిరాడంబరంగా సాగాయి. స్వయంభువు లను కొలిచిన అర్చకులు బాలాలయంలో ఉత్సవమూర్తు లను ఆరాధిస్తూ పంచామృతాలతో అభిషేకం చేపట్టారు. రాత్రి స్వామి అమ్మవార్లకు మహా నివేదన, శయనోత్సవం జరిపారు. స్వామి దేవాలయంలో క్షేత్రపాలకుడైన ఆంజనే యస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. సింధూ రంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అ ర్చించి లలితాపారాయణం చేశారు. స్వామికి ఇష్టమైన వడ పప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో ఆలయంలో ఉత్సవాలను ఆస్థాన పరంగానే నిర్వహించారు.
నమ్మాళ్వారుల తిరునక్షత్రోత్సవాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో ఆళ్వారులలో ప్రధములైన నమ్మాళ్వారుల తిరునక్షత్రోత్స వాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆళ్వారులను పట్టువస్ర్తా లను ముస్తాబు చేసి పూజలు నిర్వహించారు. ఆనంతరం పురప్పాట్ సేవను ఊరేగించారు. వేడుకల్లో ఈవో గీత, అ నువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకు డు నల్లంధీగళ్ లక్ష్మీనారసింహాచార్యులు, మోహనాచార్యు లు, ఉపప్రధానార్చకులు కాడూరి వెంకటాచార్యులు, చింత పట్ల రంగాచార్యులు, బట్టర్ సురేంద్రచార్యులు, శ్రీధరాచా ర్యులు, ఆలయ ఏఈవో భాస్కర్శర్మ, శ్రవణ్కుమార్, రమే శ్బాబు, రఘుబాబు, పాతగుట్ట అర్చకుడు కొడకండ్ల మా ధవాచార్యులు, అర్చక బృందం పాల్గొన్నారు.