చౌటుప్పల్ రూరల్, మార్చి 25 : గొల్లకుర్మల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. గొర్రెల పంపిణీకి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.3వేల కోట్ల భారీ నిధులు కేటాయించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.125 కోట్లు రానున్నాయి. వీటి ద్వా రా నూతనంగా 13,246 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. త్వరలోనే వారికి యూనిట్లను పంపిణీ చేయ నున్నారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు మమ్మురం చేశారు. ప్రస్తుతం మేలు రకం జీవాలను సేకరించనున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాల్లోని జీవాలను తేనున్నారు.
గుర్తించిన లబ్ధిదారులు ఇలా..
జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులను ఏ, బీ విభాగాలుగా విభజించా రు. ఏ విభాగంలోని 16,005 మంది లబ్ధిదారులను మొదట గుర్తించారు. వారికి ప్రాధాన్యతా క్రమంలో గొర్రెలు పంపిణీ చేశారు.అందులో ఇప్పటికే 14,756 మంది లబ్ధిపొందారు. మిగతా 1,249 మంది డీడీలు కట్టలేదు. బీ విభాగంలో 15, 884మంది ఉన్నారు. దాంట్లో 1,782 మంది ముందస్తుగానే లబ్ధి పొందారు. మరో 856మంది డీడీలు కట్టి యూనిట్లను పొందడానికి సిద్ధంగా ఉన్నారు. వీరికి త్వరలోనే గొర్రెలు పంపి ణీ చేయనున్నారు. అంతేకాకుండా బీ విభాగంలో నూతనంగా కేటాయించిన బడ్జెట్లోని నిధుల ద్వారా 13,246 మందికి యూనిట్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళిక లు కూడా రూపొందిస్తున్నారు.
ఉత్తర్వులు రాగానే అమలు
పై అధికారుల నుంచి ఉత్తర్వులు రా గానే రెండో విడుత గొర్రెల పంపిణీ అమలు చేస్తాం. ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం. గతంలో డీడీలు కట్టి న వారికి త్వరలోనే యూనిట్లు పంపి ణీ చేస్తాం. వీరి కోసం గొర్రెలను సైతం సేకరిస్తున్నాం.
-కృష్ణ, పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి