సంస్థాన్ నారాయణపురం/చౌటుప్పల్ రూరల్/రామన్నపేట/వలిగొండ, మే24: జిల్లాలో లాక్డౌన్ను కఠినంగా, పకడ్బందీగా అమలు చేస్తున్నామని యాదాద్రి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని గుడిమల్కాపురం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టును సందర్శించి మాట్లాడారు. లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలని, ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. వ్యాపా రులు పది గంటల్లోపే తమ షాపులను మూసి వేయాలని సూచించారు. ఆయన వెంట ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకటయ్య, ఎస్ఐ సుధాకర్రావు, అంజయ్య, గణేశ్, లింగస్వామి, గోపి, కర్ణాకర్ ఉన్నారు. అదేవిధంగా చౌటుప్పల్ మం డల పరిధిలోని పంతంగి టోల్ప్లాజా వద్ద ఏర్పా టు చేసిన పోలీసు చెక్పోస్టును డీసీపీ నారాయణరెడ్డి సందర్శించి, లాక్డౌన్ అమలు తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆయన వెంట ఏసీపీ సత్తయ్యగౌడ్, సీఐలు శ్రీనివాస్, ముని, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు ను డీసీపీ తనిఖీ చేసి సీఐ, ఎస్ఐలకు పలు సూచనలు చేశారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి పత్రాలు లేకుం డా బయటకొచ్చిన వాహనాలను సీజ్ చేయాలని పోలీసుల కు సూచించారు. ఆయన వెంట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చం ద్రశేఖర్, ట్రైనీ ఎస్ఐ ఉన్నారు. అదేవిధంగా వలిగొండ మం డల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు వద్ద లాక్డౌన్ అమలు తీరును డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రాఘవేందర్గౌడ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
13వ రోజు సంపూర్ణం
యాదాద్రి, మే24: యాదగిరిగుట్ట పట్టణంలో లాక్డౌన్ 13వ రోజు సోమవారం సంపూర్ణంగా సాగింది. పోలీసులు కట్టుదిట్టంగా లాక్డౌన్ను అమలు చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని కట్టడి చేశారు. 10 దాటిన తర్వాత బయటకు వచ్చిన వారి గుర్తింపు కార్డులు చూసి అనుమతించారు. ఉదయం 10 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని యాదగిరిగుట్ట పట్టణ సీఐ జానకీరెడ్డి హె చ్చరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ప్రజలు నిత్యావసరాలకు ఉదయం 6 నుంచి 10 గంటల్లోపు షాపులకు వెళ్లి తెచ్చుకున్నారు. వ్యా పారులు పది గంటల్లోపు షాపులను మూసేశారు.
లాక్డౌన్ ప్రశాంతం
రామన్నపేట, మే 24: మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా జరుగుతున్నది. ఉదయం 10గంటల లోపే వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. పోలీస్ చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ చంద్రశేఖర్ వాహనాల తనిఖీ నిర్వహించి నిబంధన లు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలపై కేసులు నమోదు చేశారు.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి
ఆత్మకూరు(ఎం), మే 24: లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా పోలీసులు కఠినంగా వ్యవహరించాల ని మండల ప్రత్యేకాధికారి శ్యామ్సుందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డు పై ఏర్పాటు చేసిన పోలీసు చెక్పోస్టును ఆయన పరిశీలించారు. లాక్డౌన్ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 10 గంటల్లోపే వ్యాపారులు తమ షాపులను మూసివేయడంతో ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఎస్ఐ ఎండీ ఇద్రిస్ అలీ సిబ్బందితో కలిసి అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించి లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
చౌటుప్పల్, మే24: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ ముని హెచ్చరించారు. సోమవారం ఆయన మున్సిపాలిటీ కేంద్రంలో లాక్డౌన్ అమలు తీరును ఆయన పరిశీలించారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు జరిమానా విధించి వాహనాలను సీజ్ చేశారు.
25 వాహనాల సీజ్
రాజాపేట, మే 24 : మండలంలో లాక్డౌన్ 13వ రోజు సంపూర్ణంగా జరిగింది. ప్రజలు పది గంటల తర్వాత ఇండ్లకే పరిమితం కావడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు వేళల్లో ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసరాలను కొనుగో లు చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 25 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్ఐ శ్రీధర్రెడ్డి తెలిపారు.
26 బైక్ల సీజ్
మోత్కూరు(గుండాల), మే 24 : జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుండాల మండల పరిధిలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 46 మందిపై కేసు నమో దు చేసి 26 బైక్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ తిరుపతిరెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జనగామ, దేవరప్పుల, మోత్కూ రు ప్రాంతాల నుంచి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న వారిపై, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.