యాదాద్రి, జూన్23: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి నిజాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. లక్ష్మీ నరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీసుదర్శన హోమం, లక్ష్మీ నరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ.100 టికెట్పై బాలాలయం ముఖ మండపంలో10 నిమిషాల పూజలో పాల్గొనే ఈ పూజలకు ఆదరణ పెరుగుతున్నది. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు జరిగాయి.
యాదాద్రిసన్నిధిలో జస్టిస్ నర్సింహారెడ్డి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపాల్ బెంచ్ చైర్మన్ జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు వారికి ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి ఖజానా రూ. 7,58,264 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 58,8 74, రూ.100 టికెట్ ద్వారా రూ.19, 000, నిత్యకైంకర్యాల ద్వారా రూ. 500, సుప్రభాతం ద్వారా రూ. 800, క్యారీబ్యాగుల ద్వారా రూ. 1,650, వ్రతాల ద్వారా రూ. 16,000, కల్యాణకట్ట ద్వారా రూ. 16,600, ప్రసా ద విక్రయశాల ద్వారా రూ. 3,16,585, శాశ్వత పూజల ద్వారా రూ. 20,232, వాహనపూజల ద్వారా రూ. 4,3 00, టోల్గేట్ ద్వారా రూ. 1,390, అన్నదాన విరాళం ద్వా రా రూ. 1,29,854, సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 59,189, యాదరుషి నిలయం ద్వారా రూ. 41,8 50, పాతగుట్ట ద్వారా రూ. 9,305, కొబ్బెరికాయల విక్రయాల ద్వారా రూ.39,000, ఇతర విభాగాల ద్వారా రూ. 32,144 కలిపి రూ. 7,58,264 ఆదాయం వచ్చింది.