‘ఆర్థికంగా నష్టమొస్తున్నప్పటికీ లాక్డౌన్ను అమలు చేస్తున్నాం. అయినా యాదాద్రి భువనగిరి జిల్లాలో కొవిడ్ కేసులు తగ్గడం లేదు. వెంటనే ఆ జిల్లాకు స్వయంగా వెళ్లి పరిస్థితులను సమీక్షించాలి’
వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్
‘ కొవిడ్ కట్టడిపై సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజే జిల్లాలో కార్యాచరణ మొదలైంది. లాక్డౌన్ విధించినప్పటికీ జిల్లాలో కొవిడ్ కేసులు తగ్గడం లేదని..స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. ఈ మేరకు శనివారం వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ బీబీనగర్ ఎంపీడీవో కార్యాలయంలో కొవిడ్ కట్టడిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ అనితారామచంద్రన్తోపాటు జిల్లా స్థాయి అధికారులు, మండల సమన్వయ అధికారులు, వైద్యాధికారులు ఇందులో పాల్గొన్నారు. కొవిడ్ బాధితులకు భరోసా కల్పించేలా వైద్యం అందించాలని, ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రభుత్వ దవాఖానలను పటిష్టపర్చుకోవాలని ఆదేశించారు. కొవిడ్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూడకుండా..జ్వరంతోపాటు ఇతర లక్షణాలు ఉన్న ప్రతి ఒక్క రూ హెల్త్ కిట్లలో అందించిన మందులను వేసుకునేలా చర్యలు తీసుకో వాలని, రెండోవిడుత జ్వర సర్వేలో కొవిడ్ బాధితుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడంతోపాటు, రద్దీ ఎక్కువగా ఉండే మాంసం, చికెన్ షాపులు తదితర ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించడంతోపాటు, భౌతిక దూరం పాటించేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.’
యాదాద్రి భువనగిరి, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో కొవిడ్ వ్యాప్తిని నియంత్రించి పాజిటివ్ కేసులను తగ్గించేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ శనివారం బీబీనగర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో జిల్లా యంత్రాంగానికి హితబోధ చేశారు. జిల్లాలోని కొవిడ్ రోగులకు భరోసా కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయడంతోపాటు.. బాధితులకు వైద్యులు, సిబ్బంది అలుపెరగని వైద్య సేవలు అందిస్తున్నారం టూ వారిలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు. ఇకముందు కూ డా వైద్యసిబ్బంది బాధితుల్లో మానసిక ధైర్యాన్ని నింపేలా చర్య లు తీసుకోవాలన్నారు. కలెక్టర్ అనితారామచంద్రన్తోపాటు అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమీక్షలో కొవిడ్ కేసుల తగ్గింపునకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
రెండో విడుత జ్వర సర్వేను చేపట్టాలి..
జిల్లాలో మొదటి విడుత జ్వర సర్వేకు కొనసాగింపుగా రెండో విడుత కూడా ఇంటింటి సర్వేను ఆదివారం నుంచే చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సూచించారు. మొదటి విడుత సర్వేలో పాల్గొన్న బృందాలే మరోసారి ఇంటింటికెళ్లి సర్వే నిర్వహించాలన్నా రు. సర్వే సందర్భంగా జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలను గుర్తించిన వారికి అందజేసిన హెల్త్ కిట్ల అనంత రం వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలన్నారు. కొత్తగా ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి హెల్త్ కిట్లను అందజేసి మందులను వాడేలా చూడాలన్నారు. ఇప్పటికే పరీక్షలు చేయించుకున్నట్లయితే టెస్ట్ ఫలితాల కోసం ఎదురు చూడకుండా.. వారికి అవసరమైన మందులను ఇవ్వాలన్నారు. ఎవరి పరిస్థితి అయినా విషమంగా ఉన్నట్లయితే వారిని వెంటనే ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులకు తరలించి తక్షణ చికిత్సను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోం ఐసొలేషన్లో ఉంటూ ఇబ్బంది పడుతున్న వారిని కూడా ప్రభు త్వ ఐసొలేషన్ కేంద్రాలకు తరలించి వైద్యమందించాలన్నారు. భువనగిరి ప్రభుత్వ దవాఖాన, చౌటుప్పల్, ఆలేరు, రామన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నందున కొవిడ్ పేషెంట్లను రిజక్ట్ చేయవద్దని సూచించారు. డిమాండ్కు తగ్గట్టుగా ఆక్సిజన్ బెడ్లను సమకూర్చుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు.
దవాఖానల్లో పరిశుభ్రతపై దృష్టి సారించాలి..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వైద్యాధికారులకు సూచించారు. ప్రతి దవాఖానలో శానిటైజర్ను అందుబాటులో ఉంచడంతోపాటు సిరంజీలు, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దవాఖానల్లో నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్, ఇతర వస్తువులను వేలం వేసి వాటిని తొలగించడం ద్వారా వార్డులు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అవసరమైతే పీహెచ్సీలకు రంగులు వేయాలని, రాత్రి వేళల్లో దవాఖానల ప్రాంగణం చీకట్లో ఉండకుండా ఎల్ఈడీ లైట్లను అమర్చాలన్నారు. జిల్లా కేంద్ర దవాఖానపై కలెక్టర్కు పూర్తి పర్యవేక్షణ ఉండాలని, అలాగే మండల సమన్వయ అధికారులు ప్రభుత్వ దవాఖానలను సందర్శించి సమీక్షించాలన్నారు. పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో కొవిడ్ ఓపీ సేవలను కొనసాగించాలని సూచించారు. మొత్తంగా బాధితులు త్వరగా కోలుకుని ఇళ్లకు వెళ్లేలా వైద్యులు భరోసా కల్పించాలన్నారు.
పాజిటివ్ కేసులను తగ్గించడం అభినందనీయం
జిల్లాలో కొవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా నమోదైన 60 శాతం పాజిటివ్ కేసులను 30 శాతానికి తగ్గించడం అభినందనీయమ ని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అన్నారు. గతేడాది జిల్లాలో కొ విడ్ పాజిటివ్ కేసులను జీరో చేశారని, అదే స్ఫూర్తితో వైద్యులు పనిచేసి జిల్లాను ఆదర్శంగా నిలపాలన్నారు. అవసరమైతే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవాలన్నారు. భువనగిరి, చౌటుప్పల్ వంటి పట్టణాలతోపాటు జాతీయ రహదారుల వెంట ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నా రు. లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేసేందుకు పోలీస్శాఖతో సమన్వయం చేసుకుని తరచుగా సమావేశాలు నిర్వహించడం ద్వారా సత్ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.