భూదాన్పోచంపల్లి, జూన్21: గతంలో కురిసిన అకాల వర్షాలతో పూర్తిగా ధ్వంసమైన పిలాయిపల్లి కాల్వకు మరమ్మతులతోపాటు కాల్వ వెడల్పు పనులను త్వరగా పూర్తి చేసి ఈనెలాఖరు నాటికి రైతులకు సాగునీరు అందిస్తామని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని జగత్పల్లి, పెద్దగూడెం, పిలాయిపల్లి, దేశ్ముఖి గ్రామాల్లో ఆయన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లోని అన్ని వార్డుల్లో కలియతిరిగి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలాన్ని సగభాగం సస్యశ్యామలం చేస్తున్న పిలాయిపల్లి కాల్వ మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ వానకాలం పంటకు రైతులకు సాగునీరు అందుతుందని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. గత యాసంగిలో కాలువ పూర్తిగా ధ్వంసం కావడం తో రైతులు పంటను సాగుచేసుకోలేని పరిస్థితి నెలకొన్నదన్నారు.
జగత్పల్లి గ్రామంలో రూ.10లక్షల హెచ్ఎండీఏ నిధులతో నిర్మించిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రూ.10లక్షలతో వేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. పెద్దగూడెం గ్రామాభివృద్ధ్దికి రూ.80 లక్షలను మంజూరు చేశారు. పిలాయిపల్లి గ్రామంలో ఈఎంఎఫ్, పంచాయతీనిధులు రూ.15 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ.1.80 కోట్లతో నిర్మించిన పంచాయతీ భవనం, రైతువేదిక, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఆయన ప్రారంభించారు. పిలాయిపల్లి గ్రామాభివృద్ధ్దికి రూ.75 లక్షల నిధులను మం జూరు చేశారు. దేశ్ముఖి గ్రామంలో రూ. 52 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఆయన ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ పుష్పలతామల్లారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశంయాదవ్, సింగిల్విండో చైర్మన్లు లింగంయాదవ్, భూపాల్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు ఎల్లారెడ్డి, పద్మారెడ్డి, హరీశ్యాదవ్, స్వప్నానరేశ్, ఎంపీటీసీలు సుమలతాలక్ష్మణ్, జంగయ్యయాదవ్, మల్లారెడ్డి, రవీందర్రెడ్డి, మహిపాల్రెడ్డి, శ్రీశైలంగౌడ్, మాధవరెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలో ఇటీవల మృతి చెందిన వారికి.. జగత్పల్లిలో తొమ్మిది కుటుంబాలకు, పెద్దగూడెంలో 42 కుటుంబాలకు, పిలాయిపల్లిలో 38 కుటుంబాలకు, దేశ్ముఖిలో 24 కుటుంబాలకు…ఒక్కొక్క కుటుంబానికి రూ. 5వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే శేఖర్రెడ్డి పైళ్ల ఫౌండేషన్ ద్వారా అందజేశారు.
పిలాయిపల్లి సర్పంచ్ టీఆర్ఎస్లో చేరిక
పిలాయిపల్లి గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధా న కార్యదర్శి అందెల హరీశ్యాదవ్ సోమవారం ఎమ్మెల్యే శేఖర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హరీశ్యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నట్లు చెప్పాడు. ఆయనతోపాటు కాం గ్రెస్ నాయకులు మురళి, మహేశ్, మహేశ్ యాదవ్, రాములు తదితరులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, విశ్వనాథ్, చంద్రశేఖర్, శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఎండీఏ నిధులతో మండల అభివృద్ధ్దికి కృషి
హెచ్ఎండీఏ నిధులతో మండల అభివృద్ధ్దికి కృషి చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లెబాటలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని చిన్నరావులపల్లి, భట్టుగూడ గ్రామాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, అం తర్గత డ్రైనేజీ వ్యవస్థ పనులను ప్రారంభించి త్వరగా పూర్తి చేయిస్తానని హామీఇచ్చారు.ఇటీవల అనారోగ్యంతో మరణించిన భట్టుగూడెం, చిన్న రావులపల్లి గ్రామాల్లో 16 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఎమ్మెల్యే శేఖర్రెడ్డి ఆర్థిక సాయాన్ని అందజేశారు. భట్టుగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి పిల్లల చదువుకు అయ్యే ఖర్చులు భరిస్తాన ని, చిన్నరావులపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండల పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలి భర్త ఇటీవల మృతి చెం దడంతో వారి కుటుంబాన్ని పరా మర్శించి అతడి కుమా రుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సుధాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పింగళ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ గణేశ్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోహన్రెడ్డి, సర్పంచ్లు బాలమణి, మాధవి, ఎంపీటీసీ బాల్చందర్, వార్డుసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్రెడ్డి, శ్రీశైలం, చంద్రశేఖర్రెడ్డి, అధికారులు, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.