భువనగిరి టౌన్, మే 21: రాజీవ్గాంధీ 30వ వర్థంతిని శుక్ర వారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఏరియా దవఖానలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డిలు పాల్గొని రాజీవ్గాం ధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం ఏరియా దవఖాన వద్ద నిర్వహించిన కార్యక్రమం లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్థానిక ఏరియా దవాఖానకు 25 ఆక్సిజన్ సిలిండర్లను, బీబీనగర్ ఎయిమ్స్కు 25 ఆక్సిజన్ సిలిండర్లను కలెక్టర్ అనితారామచంద్రన్, డీఎంహెచ్వో సాం బశివరావు సమక్షంలో అందజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి పల్స్, ఆక్సిమీటర్లను అం దజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మా ట్లాడుతూ జిల్లాలోని దవాఖానాల అభివృద్ధికి తన ఎంపీ ని ధుల నుంచి రూ.1కోటి అందజేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా కేవలం డీజిల్ ఖర్చులతో అంబులెన్స్ సేవలు నిర్వ హిస్తున్న అంబులెన్స్ వారికి ఎంపీ రూ.లక్ష అందజేశారు. అ నంతరం పేదలకు అన్నదానం, దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్కుమార్, పట్టణ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు రవికుమార్, వెంకటేశ్వర్లు, జహంగీర్, వలిగొండ ఎంపీపీ రమేశ్రాజ్, సర్పంచ్ శ్రీనివాస్, కౌన్సిలర్లు సలా వుద్దీన్, నర్సింహా, గంగాధర్, రేణుక పాల్గొన్నారు. అదే విధం గా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ నిత్యా వసర సరుకులు అందజేశారు.
బీబీనగర్: రాజీవ్గాందీ వర్ధంతి సందర్భంగా గూడూరు టో ల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పటోళ్ల శ్యామ్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం డీసీపీ నారాయణరెడ్డి ద్వారా పోలీసు సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏసీపీ భుజంగరావు, ఎస్ఐ రాఘవేందర్ గౌ డ్, నాయకులు నిఖిల్రెడ్డి, వాసుదేవరెడ్డి, శివ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం): మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్థంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వ ర్యంలో రూ.20వేల విలువ గల మందులు, శానిటైజర్లను ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రణీషకు అందజేశారు. కార్యక్ర మంలో ఎంపీపీ మంగమ్మ, జడ్పీటీసీ నరేందర్ గుప్తా, మండ లాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, సర్పంచ్ నగేశ్, సిద్ధులు, అనంతరెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.
వలిగొండ: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భం గా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి, ఆశల కు మాస్కులు, ఆక్సిమీటర్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో ఎంపీపీ రమేశ్రాజ్, సర్పంచ్ లలిత, ఎంపీటీ సీలు భాగ్యమ్మ, యశోధ, రాంరెడ్డి, వెంకట్రెడ్డి, యుగంధర్ రెడ్డి, అనంతరెడ్డి, నర్సయ్య, నాగేశ్వర్, రసూల్ పాల్గొన్నారు.