యాదాద్రి,మే 21: సీఎం కేసీఆర్తోనే వికలాంగులు, వెనుక బడిన వర్గాలకు ఆర్థిక భరోసా వచ్చిందని ప్రభుత్వ విప్ గొంగి డి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మోటకొండూ ర్ మండలం కాటేపల్లికి చెందిన వికలాంగురాలు గంధమల్ల ఇందిరమ్మకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో రూ.లక్ష వివాహా ప్రో త్సాహకం,మండల కేంద్రానికి చెందిన బీరకాయల రమణకు ఆర్థిక పునరావాస పథకం కింద రూ. 50,000, యాదగిరిగు ట్ట పట్టణంలోని గుండ్లపల్లి వెంకటేశ్కు రూ. లక్ష విలువ గల ప్రోసీడింగ్ పత్రాలను వారి ఇండ్లకు వెళ్లి అందజేశారు. కార్య క్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్, యా దగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ సుధ, టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా డైరక్టర్ మిట్ట వెంకటయ్య, మోటకొండూర్ జడ్పీటీసీ వెంకట్రెడ్డి, రైతు బం ధు సమితి కో ఆర్డినేటర్ అయిలయ్య పాల్గొన్నారు.
దివ్యాంగులకు అండగా ప్రభుత్వం
ఆలేరు టౌన్: టీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీ తా మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆలేరు మున్సిపల్ పరిధిలో శుక్రవారం దివ్యాంగులను వివాహం చేసుకున్న సకలాంగుల కు ఇచ్చే ప్రోత్సాహం కింద ప్రభుత్వం మంజూరు చేసిన నగ దు బహుమతి రూ. లక్ష చెక్కును చింతకాయల వెంకటేశ్కు అలాగే ఆర్థిక పునరావాసం కింద మంజూరైన రూ. 50వేల చెక్కును చింతకాయల జ్యోతికి ఆమె అందజేశారు. కార్యక్ర మంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ నాగరాజు, కౌన్సిలర్లు దయామణి, రాములు, మండ ల పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
దివ్యాంగులకు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రాజాపేట: ఐసీడీఎస్ నుంచి మంజూరైన చెక్కులను సద్విని యోగం చేసుకోని ఆర్థిక పురోగతి సాధించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండ లంలోని బొందుగుల గ్రామానికి చెందిన దివ్యాంగుడు ము త్యం కరుణాకర్ రూ. లక్ష, దూదివెంకటాపురం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు వస్పరి స్వాతికి రూ. 50 వేలు ఆలేరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నుంచి మంజూరైన చెక్కులను ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అంద జేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోపాల్గౌడ్, టీఆర్ఎ స్ మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్య క్షుడు శ్రీనివాస్రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణ మ దర్డెయిరీ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ మధుసూదన్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.
ఆర్థికాభివృద్ధికి చేయూత
యాదగిరిగుట్ట రూరల్: దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి ప్రభు త్వం చేయూతనిస్తున్నదని ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామ హేందర్రెడ్డి అన్నారు. దివ్యాంగుల లబ్ధిదారులకు ఆలేరు ఐ సీడీఎస్ ప్రాజెక్టు ద్వారా మంజూరైన రూ. 50వేల చెక్కును శుక్రవారం యాదగిరిగుట్ట మండలం కంఠంగూడెం గ్రామం లోని కందుకూరి విజయలక్ష్మికి అందజేశారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం..
యాదాద్రి/ మోటకొండూర్: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన మోటె ఎల్లయ్యకు రూ. 60,000, రేగు అ యిలమ్మకు రూ.45,000, బుగ్గ. మనోజు కుమార్ రూ. 9, 500, ఆలేటి నాగరాజుకు రూ. 60,000, తేర్యాల గ్రామానికి చెందిన పంజాల రాజయ్యకు రూ. 11,000, చందేపల్లి గ్రా మానికి చెందిన గణేశ్ కు రూ. 21,000, వర్టూర్ సిద్దారెడ్డికి రూ. 30,000లకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్ర వారం లబ్ధిదారులకు అందజేశారు.