ఆత్మకూరు(ఎం),మే 21: కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా నిరంతరం కృషిచేస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసు లకు శుక్రవారం మండల కేంద్రంలో రామలింగేశ్వస్వామి ఆల య కమిటీ చైర్మన్ గడ్డం దశరథగౌడ్ భోజనం ప్యాకెట్లు అం దజేశారు. కార్యక్రమంలో ఎస్సై ఇద్రీస్అలీ, హెడ్ కానిస్టేబుల్ హబీబ్, టీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం నాయకులు శేఖర్, మల్లికార్జున్, రాజు, మహేందర్, సతీశ్తో పాటు పోలీ సులు శ్రీను, శంకర్, రాంచందర్, శేఖర్ పాల్గొన్నారు.
దాతల సహాకారంతో ఆహార ప్యాకెట్ల పంపిణీ
భువనగిరి అర్బన్: లాక్డౌన్ నేపథ్యంలో పట్టణంలో దాతల సహకారంతో అనాథలకు ఆహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. పట్టణంలోని అనాథలకు, బస్టాండ్లోని ప్ర యాణికులకు, రైల్వేస్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బంది, మెడికల్ సిబ్బందితో పాటు ఆకలితో ఉన్న వారికి 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతిమహేశ్ సహకారంతో అందజేసిన ఆహార ప్యాకెట్లను శుక్రవారం 240 మందికి పంపిణీ చేశారు. కార్యక్ర మంలో వార్డు అధ్యక్షుడు శ్రీనివాస్, వాసవిక్లబ్ ఇంటర్నేషల్ ప్రెసిడింట్ హరిరాయిని, సెక్రటరీ రవి, ట్రెజరర్ దినకర్మూర్తి, సంకీర్త్ తదితరులు పాల్గొన్నారు.
స్వీయ నియంత్రణ పాటించాలి
ఆలేరురూరల్: గ్రామ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాల ని సర్పంచ్ వంగాల శ్రీశైలం అన్నారు. శుక్రవారం మండలం లోని తూర్పుగూడెంలో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యా వసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బండి నరేందర్, ఆంజనేయులు, పరుశు రాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కరోనా పరీక్షా కిట్ల పంపిణీ
సంస్థాన్ నారాయణపురం: కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సహకారం తో వెయ్యి కరోనా పరీక్షా కిట్లను మండల ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి దీప్తికి మండల నేతలు శుక్రవారం అం దజేశారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంజీవ, బాలకృష్ణ, లిం గస్వామి, నర్సింహ్మ, సతీశ్, బుజ్జి, రమేశ్బాబు పాల్గొన్నారు.
చౌటుప్పల్: కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స మకూర్చిన వెయ్యి కరోనా కిట్లను శుక్రవారం కాంగ్రెస్ నాయ కులు చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్కు అందజేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. శివప్ర సాద్రెడ్డి, కాంగ్రెస్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ సైదులుగౌడ్, బ్లాక్ అధ్యక్షుడు వెంకటయ్య, శ్రీనివాస్రెడ్డి, శ్రీనాథ్, భాస్కర్ , సాయిలు, మధు, రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మాస్కులు శానిటైజర్లు పంపిణీ
రామన్నపేట: రాజీవ్గాంధి వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో హమాలీలకు మాస్క్లు, శానిటైజర్లను పం పిణీ చేశారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జమీరోద్దిన్, అబ్రహంకుమార్, అల్లయ్య, బషీరదౌల, ఎజాస్, జానీ, గోపి, మధు, శేఖర్, రాజు, లింగస్వామి పాల్గొన్నారు.
మోత్కూరు(గుండాల): దివంగత ప్రధాని రాజీవ్గాంధీ 30 వ వర్థంతి సందర్భంగా శుక్రవారం గుండాల మండల పరిధి లోని వెల్మజాలలో గ్రామ పంచాయతీ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ భిక్షం, ఎంపీటీసీ అలివేలు, నాయ కులు రమేశ్, బాలకృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా వైరస్పై అవగాహన
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలంలోని వంగ పల్లిలో హెల్పెజ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్ర వారం వృద్ధులకు ఉచిత వైద్య సేవలు, కరోనా వైరస్పై అవగా హన చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ సోషల్ ప్రోటెక్షన్ ఆఫీస ర్ ఎల్లబోయిన సాంబరాజు మాట్లాడుతూ లాక్డౌన్ సమ యంలో వృద్ధులకు ఎలాంటి అంతరాయం లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బీపీ, షుగర్, థైరాయిడ్, ఫి ట్స్, గుండె, కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులకు ఉచిత మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ కార్తీ క్ కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. కార్యక్రమంలో రాజయ్య, పెంటయ్య, భిక్షపతి, చం ద్రమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.