బీబీనగర్, జూన్ 18: గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లెబాటలో భాగంగా శుక్రవారం మండలంలోని జమిలాపేట్, జియాపల్లి, జియాపల్లితండా, రాయరావుపేట్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో అవసరం ఉన్న చోట సీసీ రో డ్లు, అంతర్గత మురుగునీటి వ్యవస్థ పనులను అతి త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామని హామీఇచ్చారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన జమిలాపేట్లో 17 కుటుంబాలకు, జియాపల్లి లో ఏడు కుటుంబాలకు, రాయరావుపేటలో 14 కుటుంబాలకు పైళ్ల ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ.5000 చొప్పున ఆర్థిక సాయా న్ని అందజేశారు. ఇటీవల జియాపల్లిలో కొవిడ్తో మృతి చెందిన వరిగంటి అనిల్గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి వారి పిల్లల చదువుకు అ య్యే ఖర్చును భరిస్తానని కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే శేఖర్రెడ్డి హామీ ఇచ్చారు.
జియాపల్లిలో వైకుంఠధామానికి ప్రహరీ నిర్మించాలని ప్రజలు కోరగా స్పందించిన ఆయన పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, రాష్ట్ర నాయకుడు పింగళ్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీ పీ వాకిటి గణేశ్రెడ్డి, సర్పంచ్లు బొర్ర సంతోషారమేశ్, కొమ్మిడి ప్రేమలత, వరిగంటి కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, బాల్రాజ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
అదేవిధంగా కొండమడుగు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ బీబీనగర్ మండల మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాండు సతీమణి గుండెపోటుతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే శేఖర్రెడ్డి గ్రామానికెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.