మోత్కూరు, మార్చి 16 : ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని మోత్కూరు మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి అన్నారు. మంగళవారం మోత్కూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీకాను సావిత్రీమేఘారెడ్డి దంపతులు తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. పీహెచ్సీ పరిధిలో పనిచేస్తున్న ఐదుగురు వైద్య సిబ్బందికి సెకండ్ డోస్, 53 మంది పౌరులకు మొదటి డోస్ వ్యాక్సిన్ చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ చైతన్యకుమార్ తెలిపారు.
బీబీనగర్, మార్చి16 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి మంగళవారం కొవిడ్ టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపోహలు వీడి ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో దేవేందర్రెడి,్డ మండల వైద్యాధికారులు డాక్టర్ దాక్షాయణి, డాక్టర్ గీత పాల్గొన్నారు.
అడ్డగూడూరు,మార్చి 16: ప్రజలు భయాందోళనకు గురికాకుండా ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూలపల్లి జనార్దన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మంగళవారం ఆయన కొవిడ్ టీకా తీసుకున్నారు. 11 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి నరేశ్ తెలిపారు.